mt_logo

హైదరాబాద్ తో కూడిన పది జిల్లాల రాష్ట్రసాధనే లక్ష్యం: కోదండరాం

ఎన్ని దుష్టశక్తులు ఎదురైనా హైదరాబాద్ తో కూడిన తెలంగాణ సాధనే తమ లక్ష్యమని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రంగారెడ్డి జిల్లా శామీర్ పేట్ మండలం జవహర్ నగర్ లో చాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర నుంచి ఎన్ ఎఫ్ వీ కాలనీ వరకు దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.

సీమాంధ్రులు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రం ఆగదని ఆయన స్పష్టం చేసారు. సీమాంధ్రులు హైదరాబాద్ విషయంలో చేసే కుట్రలను ఆపడానికి జేఏసీ మాత్రం ఎల్లప్పుడూ సిద్ధంగా వుంటుందన్నారు.

పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా జేఏసీ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర విభజనకు ఎన్ని శంఖారావాలు అడ్డువచ్చినా, తెలంగాణ ఉద్యమం ముందుకు అవి సరిపోవన్నారు. తెలంగాణ ప్రజలది ఆత్మగౌరవ ఉద్యమమని, సమైక్యాంధ్రవాదులది ఆస్తులను కాపాడుకునే ఉద్యమమని ఆయన మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *