తెలంగాణ కోసం 1200 పైగా తెలంగాణ విద్యార్థులు, యువకులు బలయ్యారని, వారి త్యాగఫలితమే టీ బిల్లు అని బీజేపీ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కిరణ్ సమైక్యవాదం ముసుగులో ఉన్మాదిలా మాట్లాడుతున్నారని, తెలంగాణ కోసం అమరులైన వారి గురించి పట్టించుకోని సీఎం సమైక్యవాదం వినిపించడం అర్ధంలేనిదన్నారు. ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు కనీసం బలిదానాల గురించి మాట్లాడకపోవడం సిగ్గుపడేవిధంగా ఉందని, ఆంధ్రజాతి కాబట్టే తెలంగాణ వారిపై వివక్ష చూపుతున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, ఇంకా హక్కులు కావాలని సీమాంధ్రులు కోరితే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. పెద్దమనుషుల ఒప్పందం అమల్లోకి తేవాలని అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి చెప్పినా పట్టించుకోలేదని, 1969 ఉద్యమంలో పాల్గొని డిసెంబర్ 3వ తేదీన అరెస్ట్ అయ్యానని నాగం చెప్పారు. 1969 ఉద్యమం నాటి ఎన్నో సంఘటనలను ఆయన సభకు వివరించారు. సీమాంధ్రుల పాలనలో తెలంగాణ ప్రజలకు అన్నీ కష్టాలేనన్నారు. అసెంబ్లీలో అస్సలు ప్రజాస్వామ్యం లేదని, సమైక్య రాష్ట్రంలో నీటివనరుల దోపిడీ ఏవిధంగా జరిగిందో పూర్తి వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ రాష్ట్రం అలానే ఉంటే తెలంగాణ సస్యశ్యామలం అయ్యుండేదని బచావత్ ట్రిబ్యునల్ చెప్పిందని గుర్తు చేశారు. నీలం సంజీవరెడ్డి నీటిని రాకుండా చేసి మహబూబ్ నగర్ జిల్లాను నాశనం చేశారన్నారు. ప్రాణహిత- చేవెళ్ళ ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- Bhu Bharathi: Mandatory survey for land sales causes several hardships
- రేవంత్ సర్కార్ తొలగించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక ఇదే!
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!