అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా మరికొన్ని రోజులు గడువు పెంచమని కేంద్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి లేఖ వ్రాయడం రాజ్యాంగ విరుద్ధమని, ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉన్న పీఎస్ ఇలా అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తుందని రాజ్యాంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొద్ది రోజుల్లో సీఎస్ పదవీకాలం ముగుస్తుండటంతో మరో మూడు నెలలపాటు పొడిగించుకోవడానికే ఆయన ఈ విధంగా చేసిఉంటారని వార్తలు వస్తున్నాయి. అంతకుముందు కూడా మంత్రుల నిర్ణయంతో ప్రమేయం లేకుండా బిల్లులో ఉన్న అంశాలగురించి ప్రస్తావిస్తూ ఒక లేఖ కేంద్రానికి రాయడం జరిగింది. ఈ విషయంపై కొందరు మంత్రులు ఆయన వైఖరిపట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గడువుపెంపు కోసం కేంద్రానికి లేఖ వ్రాయమని సీఎం తనకు సూచించినా సభ్యులంతా ఒకే తాటిమీద లేకపోవడంతో తాను నిరాకరించానని స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈ విషయంలో స్పీకర్ కానీ, కౌన్సిల్ చైర్మన్ మాత్రమే నిర్ణయం తీసుకోవాలని, ఇతరులెవరికీ అధికారం లేదని రాజ్యాంగ నిపుణుల వాదన.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్