mt_logo

నీటిపారుదల అభివృద్ధి శాఖలో అక్రమ ప్రమోషన్లు!

రాష్ట్ర విభజన సమయంలోనూ నీటిపారుదల అభివృద్ధి శాఖలో అక్రమ పదోన్నతుల పర్వం కొనసాగుతోంది. ఎలాంటి పదోన్నతులు ఉండరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా సీమాంధ్ర అధికారులు కొందరు నిబంధనలకు వ్యతిరేకంగా అడ్డదారులు తొక్కుతున్నారు. నీటిపారుదల అభివృద్ధి శాఖ(ఏపీఐడీసీ) లో కొంతమంది ఏఈ, డీఈఈ, ఈఈలకు ప్రమోషన్లు ఇచ్చేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. విషయం తెలిసిన తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు.

తెలంగాణ ఉద్యోగులకు నష్టం చేసేందుకే కొంతమంది సీమాంధ్రకు చెందిన ఉన్నతాధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా పదోన్నతులు ఇస్తున్నారని, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పై చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్ కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతికి తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *