mt_logo

దివ్యాంగుల సమస్యలపై రివ్యూ మీటింగ్ నిర్వహించిన మంత్రి కొప్పుల..

ఈ రోజు హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలపై దివ్యాంగుల సంక్షేమం కార్పొరేషన్ అధికారులతో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వికలాంగుల పలు సమస్యలు, వాటి పరష్కారాల కొరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లాలని, అదే విధంగా వాళ్ళకి ప్రభుత్వం నుండి అమలు అవుతున్న సంక్షేమ పథకాలు పెన్షన్, రేషన్ కార్డులు మొదలగునవి అందే విధంగా చర్యలు తీసుకోవాలని, అర్హులైన వారికి సంబంధించిన వివరాలు సేకరించి పూర్తి వివరాలతో ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య ఐఏఎస్, డైరెక్టర్ శైలజ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *