mt_logo

మళ్ళీ వాయిదాపడ్డ టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు

టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు మళ్ళీ వాయిదా పడ్డాయి. ఈనెల 11, 12 తేదీల్లో జరగాల్సిన ఈ సమావేశాలు హుదూద్ తుఫాను కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. 18, 19 తేదీల్లో జరగాల్సిన ప్లీనరీ సమావేశాలు కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతి సంవత్సరం టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు ఏప్రిల్ నెలలో జరుగుతాయి. అయితే ఈ ఏడాది ఎన్నికలు ఉండటం, సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం, సమగ్ర సర్వే, హుదూద్ తుఫాను తదితర అంశాలతో ప్లీనరీ వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం దీపావళి పండుగ, బడ్జెట్ సమావేశాల నిర్వహణ వంటి కారణాలతో ప్లీనరీ వాయిదా పడ్డట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *