mt_logo

లండన్‌లో ఘనంగా NRI TRS సెల్ 6వ వార్షికోత్సవ వేడుకలు

– ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి చందూలాల్ మరియు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

లండన్‌లోని ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ 6వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు, తెలంగాణ టూరిజం మంత్రి శ్రీ అజ్మీరా చందూలాల్ మరియు చేవెళ్ల MP శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

యుకే నలుమూలల నుండి భారీగా తెరాస కార్యకర్తలు, తెలంగాణ వాదులు హాజరయ్యారు. ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ ముఖ్య నాయకుడు చాడా సృజన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కార్యక్రమానికి, ముందుగా అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, జయశంకర్ గారికి నివాళులు అర్పించారు.

ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ 6 సంవత్సరాలలో చేసిన ముఖ్య కార్యక్రమాల వీడియోని ప్రదర్శించి, అతిథులకు వివరించారు. ఇది చూసి హాజరైన ప్రతి ఒక్కరు ఉద్వేగానికి లోనయ్యారు.

చందూలాల్ గారు మాట్లాడుతూ, ఉద్యమం లో ఎన్నారైల పాత్ర గొప్పదని తెలిపారు, బంగారు తెలంగాణ నిర్మాణ దిశ లో టి.అర్.యస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించారు, ముఖ్యంగా పర్యాటక రంగంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ నిర్ణయాలను తెలిపారు. అలాగే తను లండన్ లో గత కొన్ని రోజులుగా హాజరైన ” ట్రావెల్ ఎక్స్పో” విషయాలను సభకు వివరించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ఖండాంతరాల్లో ఎన్నారైలు చాటి చెప్తున్న తీరు గార్వకారణమన్నారు. సంధర్భం వచినప్పుడు తెలంగాణ సమాజాం కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్న ఎన్నారైలను స్వరాష్ట్రానికి ఆహ్వానించి సత్కరిస్తామని తెలిపారు.

విశ్వేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ గారు అహర్నిశలు కష్టపడుతున్నారని ఎటువంటి సందేహాలు అవసరం లేదని హామీ ఇచ్చారు. ప్రతి దేశంలో మనం నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు ఉంటాయని, ప్రవాస బిడ్డలుగా ఇక్కడ నేర్చుకున్న విషయాలను ఉదాహరణకి, “డిగ్నీటి ఆఫ్ లేబర్”, “పరిశుభ్రత” , ఇలా ఎన్నో స్వదేశం వచినప్పుడు మన రాష్ట్ర ప్రజలకు వివరించి మార్పుకు తోడ్పడాలని సలహనిచ్చారు. యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా, ఎంటర్ ప్రీనర్స్ గా ఎదిగేలా కృషి చేయాలని, ఏదైన సలహాలు కావాలంటే నన్ను సంప్రదించొచ్చని తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా పార్టీ ఎన్నారై శాఖను ముందుండి నడిపిస్తున్న అనిల్ కూర్మాచలంని అభినందించి సభ్యులకు 6 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో లండన్ లోని టి.అర్.యస్ సెల్ పాత్ర గొప్పదని కీర్తించారు.

ఎన్నారై టి.అర్.యస్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, ఎంతో బిజీగా ఉన్నపటికీ సమయం ఇచ్చి కార్యక్రామానికి వచ్చినందుకు చందూలాల్ గారికి మరియు విశ్వేశ్వర్ రెడ్డి గారికి కృతఙ్ఞతలు తెలిపారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపర్చడం మన చారిత్రాత్మక అవసరమని, ఎన్నారై టి.అర్.యస్ సెల్ కి ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు మరియు యావత్ టి.అర్.యస్ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పునర్నిర్మాణం లో కూడా వారి వెంట ఉంటామని తెలిపారు. కార్యవర్గ సభ్యులకి 6 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

లండన్ లో కరాటే పోటీలకు వచ్చిన OU JAC అధ్యక్షులు కరాటే రాజు కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ, ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ వారితో తనకు ఉద్యమంలో ఉన్న అనుభందాన్ని గుర్తుచేసుకొన్నారు, అలాగే లండన్ లోని ఎన్నారై ల పాత్రను ప్రశంసించారు.

ఆ తరువాత కేకు కట్ చేసి 6 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలువురు ప్రవాస తెలంగాణ బిడ్డలు మంత్రి చందులాల్ ఆధ్వర్యంలో టి.అర్.యస్ పార్టీలో చేరారు. వారిని కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. చివరిగా, మంత్రిని, ఎంపీని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.

వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమంలో అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్ దూసరి, కార్యదర్శులు నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, యూకే ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి రేకుల, లండన్ ఇంచార్జ్ రత్నాకర్ కడుదుల, సభ్యులు సతీష్ రెడ్డి బండ, సెరు సంజయ్, సృజన్ రెడ్డి, హరి నవపేట్, మల్లా రెడ్డి, సత్యపాల్, సత్యం రెడ్డి కంది, రాజేష్ వర్మ, మధుసూధన్ రెడ్డి, శ్రీనివాస్ కలకూంట్ల, వినయ్ ఆకుల, వీర ప్రవీణ్, గణేశ్ పస్తమ్, నవీన్ భువనగిరి, వేణు రెడ్డి, సత్య జిల్లా, రాకేష్, సత్య చిలుముల, రవి ప్రదీప్, హాజరైన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *