mt_logo

తెలంగాణ ప్రజలంతా టీఆర్ఎస్ వైపే…

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ పట్ల తెలంగాణ ప్రజలు తమ ప్రేమను చూపించి గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కూడా భారీ విజయాన్ని కట్టబెట్టారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో జరిగిన మూడు విడతల గ్రామ పంచాయితీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ ఫలితాలతో తెలంగాణ ప్రజలంతా కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నామని తెలియజేశారన్నారు. 9 వేలకు పైగా పంచాయితీల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధులు గెలుపొందడాన్ని ప్రజల విజయంగా కేటీఆర్ ట్విట్టర్ లో తెలిపారు. ఈ సందర్భంగా నూతన సర్పంచులుగా ఎన్నికైన వారికి కేటీఆర్ అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *