mt_logo

టీ కాంగ్రెస్, టీ బీజేపీ కేసీఆర్ బిక్షే!!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఈరోజు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణమండపంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ 20 ఏళ్ల కాలంలో చరిత్రలో ఎన్నో విజయాలు సాధించాం. ప్రతి గ్రామంలో అందరినీ కలుపుకుపోవాలని, టీఆర్ఎస్ అందరి పార్టీ అని, పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో అగ్రభాగాన ఉండాలని స్థానిక కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

 

చిన్న చిన్న విజయాలకే ఎగిరిపడుతున్న బీజేపీ నేతలకు తగిన సమయంలో బుద్ది చెప్తామని, సహనాన్ని అసమర్ధతగా భావిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్ ఏర్పడ్డాయంటే అది కేసీఆర్ భిక్ష అని, సీఎం కేసీఆర్ ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, నాటి ముఖ్యమంత్రులను ఉరికించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను కూడా వదిలిపెట్టం. మాటలు మాట్లాడాల్సి వస్తే తాము మీకంటే ఎక్కువగా మాట్లాడుతామని హెచ్చరించారు.

రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ నిలబెట్టారని, కేసీఆర్ పరిపాలనాదక్షుడు అని కేంద్రమంత్రులే చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు.  వందశాతం సాగు, తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే చెప్పింది. ఆనాడు కాంగ్రెస్ 9 గంటల కరెంట్ అని చెప్పి ఏ ఒక్కరోజు కూడా 6 గంటల కరెంట్ కూడా ఇవ్వలేదని, అర్ధరాత్రి కరెంట్ ఇచ్చి రైతుల ప్రాణాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, రైతుబంధు, రైతు భీమా, రుణమాఫీలతో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *