mt_logo

కేరళ పర్యటనలో పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్

రెండురోజుల పర్యటన నిమిత్తం కేరళ రాష్ట్రం వెళ్ళిన పంచాయితీ రాజ్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ఈరోజు తిరువనంతపురం జిల్లాలోని మణికల్ గ్రామ పంచాయితీని సందర్శించారు. అక్కడి అధికారులతో సమావేశమైన మంత్రి గ్రామ పంచాయితీలు విజయవంతం అవడానికి కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయితీల పనితీరుపై అక్కడి గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కేరళ పర్యటనలో మంత్రి కేటీఆర్ తో పాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ రేమండ్ పీటర్, ఆర్ డీ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *