mt_logo

హుస్సేన్ సాగర్ ప్రక్షాళన ప్రారంభం..

వేసవిలో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనులను చేపడతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొద్దిరోజులక్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నగరంలోని హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనులు ప్రారంభం అయ్యాయి. జీహెచ్ఎంసీ, నీటిపారుదల శాఖ అధికారులు ఈరోజు సాగర్ ప్రక్షాళన పనులను ప్రారంభించారు. కాలువల ద్వారా హుస్సేన్ సాగర్ లోని నీటిని బయటకు తరలిస్తున్నారు. దీంతో మరికొద్ది రోజుల్లో హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు నగరవాసులకు మరింత ఆహ్లాదం కలిగించనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *