mt_logo

హోంగార్డుల వేతనాలను పెంచిన తెలంగాణ సర్కార్..

హోంగార్డుల వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 6న హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వారికి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం మాట్లాడుతూ, నెలకు రూ. 9 వేల నుండి రూ. 12 వేలకు పెంచినట్లు, పెంచిన వేతనాల వల్ల రాష్ట్రంలోని 16 వేలమంది హోంగార్డులకు లాభం చేకూరనుందని పేర్కొన్నారు. పరేడ్ అలవెన్స్ రూ. 28 నుండి రూ. 100కు పెంచామని, జంట నగరాల పరిధిలోని హోంగార్డులకు బస్ పాస్ లు ఇస్తామన్నారు. ఆరోగ్య భీమా, సంవత్సరానికి 2 యూనిఫాంలు ఇస్తామని, పెంచిన వేతనాలు 2015 ఏప్రిల్ నుండి అమల్లోకి వస్తాయని సీఎం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *