డెంగీ, మలేరియా, గన్యా వంటి విషజ్వరాలతో రాష్ట్రం వణుకుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం శోచనీయం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. డెంగీ జ్వరాల బారిన పడి 24 గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.. ప్రభుత్వ నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతున్నది అని దుయ్యబట్టారు.
ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే ప్రభుత్వాన్ని హెచ్చరించాం. నిధులు విడుదల చేసి పారిశుధ్య నిర్వహణ కొనసాగించాలని, ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని వానాకాలం ప్రారంభంలోనే కోరాము. కానీ ప్రభుత్వం మా సూచనలను పెడచెవిన పెట్టింది. సకాలంలో చర్యలు తీసుకొని ఉంటే విషజ్వరాలు ఇంతగా విజృంభించేవి కావు అని పేర్కొన్నారు.
ఏటా వానాకాలం ప్రారంభంలోనే పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం మొదటి నుంచి పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ వచ్చింది. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఒక్కనాడు కూడా సమీక్ష నిర్వహించ లేదు. దోమల నివారణకు గ్రామాలు, పట్టణాల్లో స్పెషల్ డ్రైవ్లు చేపట్టలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో పారిశుద్ధ్యం పడకేసింది అని విమర్శించారు.
మరోవైపు పంచాయతీలకు నిధులు విడుదల చేయయపోవడంతో గ్రామాలు మురికికూపాలుగా మారుతున్నాయి. సొంత జేబుల నుంచి ఖర్చు చేస్తూ వచ్చిన పంచాయతీ కార్యదర్శులు ఇక తమ వల్ల కాదని సామూహికంగా సెలవులు పెడుతున్నారు, విధులకు దూరంగా ఉంటున్నారు అని హరీష్ రావు అన్నారు.
ప్రభుత్వ సమీక్షలు లేక, నిధులు విడుదల చేయక, పారిశుద్ధ్య నిర్వహణ జరగకపోవడంతో దోమలు విజృంభించి విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో జ్వరాల బారిన పడుతున్నారు. ప్రతి రెండు ఇండ్లలో ఒకరు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని ధ్వజమెత్తారు.
ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడం లేదు. మొద్దు నిద్ర వీడటం లేదు. పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయాలు చేయడం, ప్రతిపక్ష నాయకుల మీద బురద జల్లడానికే ప్రాధాన్యమిస్తున్నది అని మండిపడ్డారు.
ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి పారిశుద్ధ్య నిర్వహణ, ఆసుపత్రుల సన్నద్దత వంటి ముఖ్యమైన అంశాలపై తక్షణం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి వైరల్ ఫీవర్స్ బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా చూడాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.
- Power tariff likely to be hiked from November, imposing huge burden on public
- EPW highlights Telangana’s outstanding debt and resource management during KCR’s rule
- The carrot-and-stick approach of Revanth Reddy’s media management
- BRS to fight until GO 29 is revoked: KTR
- BRS urges ERC to reject power tariff hike proposals
- ఆర్థిక నిర్వహణ, అప్పుల నిర్వహణ, రిసోర్స్ మేనేజ్మెంట్లో తెలంగాణ టాప్: కేటీఆర్
- అరుదైన వ్యాధి ఉన్న మూడేళ్ల బాబుకు కేటీఆర్ స్ఫూర్తితో ఎమ్మెల్సీ పోచంపల్లి సాయం
- రూ. 18,500 కోట్ల విద్యుత్ భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది: ఈఆర్సీకి బీఆర్ఎస్ విజ్ఞాపన పత్రం
- Ministers, journalists visit Seoul’s waste-to-energy plant, though Hyderabad has 2 advanced facilities
- Education Commission advisory council expresses discontent with Congress govt.?
- హైదరాబాద్ను స్టార్టప్లకు కేరాఫ్ అడ్రస్గా తీర్చిదిద్దాం: ఇస్బాకాన్ సదస్సులో కేటీఆర్
- గ్రూప్-1 అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు శోచనీయం: కేటీఆర్
- ఇంటర్నెట్ నుండి ఫోటోలు కాపీ కొట్టి పరువు పోగొట్టుకున్న రేవంత్ సర్కార్!
- మూసీ సుందరీకరణకు రూ. 1.5 లక్షల కోట్లు ఉన్నాయి.. రైతు భరోసాకు పైసలు లేవా?: కేటీఆర్
- జీవో 29 తెచ్చి రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచిన రేవంత్: హరీష్ రావు