mt_logo

ఈనెల 29న యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన..

నల్గొండ జిల్లా దామరచర్లలో నెలకొల్పనున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఈనెల 29న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న నాలుగువేల మెగావాట్ల యాదాద్రి ప్రాజెక్టు కోసం నల్గొండ జిల్లా దామరచర్ల వద్ద 4,334.01 హెక్టార్ల అటవీభూములను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా శంకుస్థాపన అనంతరం హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలోని నకిరేకల్ సమీపాన భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *