mt_logo

వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న డీకే అరుణ, కేటీఆర్

శాసనసభలో ఈరోజు ఉదయం చేసిన పరస్పర విమర్శలను ఉపసంహరించుకుంటున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, మంత్రి కేటీఆర్ లు తెలిపారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే మంత్రి కేటీఆర్ తాను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ కూడా శాసనసభలో మైక్ ను విరగ్గొట్టి అమర్యాదగా ప్రవర్తించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఉదయం సభలో టీఆర్ఎస్ సభ్యుడిని నోరు మూసుకో అన్నందుకు క్షమాపణ కోరుతున్నానని ఆమె చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *