mt_logo

కాంగ్రెస్ పాలన అంటేనే దగా: జహీరాబాద్ మున్నూరు కాపు సంఘం నేతలతో హరీష్ రావు

లోక్‌సభ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరుతూ జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మున్నూరు కాపు సంఘం నేతలు
తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును కలిసి వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మీ వినతిని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళతాం.. మీ ఆలోచనలను వివరిస్తాం. కేసీఆర్ గారు ఎక్కువ మందికి అవకాశం ఇచ్చే వ్యక్తి.. మున్నూరు కాపు నేతలకు గతంలోనూ ఎంతో మందికి అవకాశం కల్పించారు అని తెలిపారు.

కేసీఆర్ ఉండగా రాష్ట్రంలో ఏ రోజు కూడా కరెంట్ పోలేదు. నిన్న ఒక ఊరుకు పోతే కరెంట్ కోతలు మొదలయ్యాయని రైతులు అవేదన చెందారు.. పదేళ్లలో ఎలాంటి బాధ లేకుండా చూసుకున్నాం అని గుర్తు చేశారు.

వంద రోజుల్లో 13 హామీలు అన్నారు. డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ అన్నారు.. ఎన్ని 9 తేదీలు మారినా రుణమాఫీ కావడం లేదు. బోనస్ విషయంలో దగా.. రుణమాఫీ విషయంలో దగా.. ఉచిత కరెంట్ విషయంలో దగా.. రైతు బంధు విషయంలో దగా.. కాంగ్రెస్ పాలన అంటేనే దగా అన్నట్లు ఉంది.. చెప్పుకుంటూ పోతే మొత్తం 420 దగాలు ఉన్నాయి అని పేర్కొన్నారు.

పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ఈ మాత్రం కరెంట్ ఇస్తున్నారు. ఎన్నికలు అయిపోతే కరెంట్ కోతలు పూర్తి స్థాయిలో ఉంటాయి.. మోడీని బడే భాయ్ అని, ఎల్లప్పుడూ ఆయన ఆశీర్వాదం ఉండాలని రేవంత్ అన్నాడు.. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదు అని రేవంత్ చెప్పకనే చెప్పారు అని హరీష్ రావు అన్నారు.

దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలో ఉన్నారు.. ఢిల్లీలో కాంగ్రెస్ వచ్చేది లేదు, ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే దిగేదేమి లేదు.. కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడే బీఆర్ఎస్‌ను గెలిపించాలి.. కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే బీఆర్ఎస్ పోరాటంతోనే సాధ్యం అవుతుంది అని స్పష్టం చేశారు.

రుణమాఫీ, రైతు బంధు, కరెంట్, బోనస్ ఇవ్వనందుకు రైతులు ఏకమై వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాలి. వంద రోజుల్లో ఆరు గ్యారెంటేలు అన్నారు.. అసెంబ్లీలో చట్టం చేస్తాం అన్నారు.. చేయలేదు… మన వేలితో మన కన్ను పొడుచుకోవద్దు. తప్పిపోయి కాంగ్రెస్‌కు ఓటు వేయోద్దు అని అన్నారు.

బాండ్ పేపర్ ఇచ్చి రైతులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది.. కాంగ్రెస్ ఒడితెనే కాంగ్రెస్ హామీలు అమలు అవుతాయి. రైతులను సంఘటితం చెయ్యాలి. మార్చి నెలాఖరుకు ఎండలు ముదిరితే పంట సాగు ఎలా అని రైతులు ఆందోళన పడుతున్నారు.. కాంగ్రెస్ మోసాలు వివరించాలి అని హరీష్ రావు తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలి.. రెండు సార్లు గెలిపిస్తే పార్టీకి మోసం చేసిండు బీబీ పాటిల్.. వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలి.. దేశంలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వచ్చే అవకాశం లేదు అని ఎద్దేవా చేశారు.