mt_logo

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం కేసీఆర్..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ అసెంబ్లీ లోని కమిటీ హాల్-1 లో జరుగుతున్నది. ఐదు స్థానాల కోసం ఆరుగురు అభ్యర్ధులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుండి ఎగ్గె మల్లేశం, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎంఐఎం నుండి రియాజ్ కాగా కాంగ్రెస్ నుండి గూడూరు నారాయణ రెడ్డి పోటీలో ఉన్నప్పటికీ ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. దీంతో టీఆర్ఎస్ అభ్యర్ధులు నలుగురు, మజ్లిస్ అభ్యర్థి ఎన్నిక లాంఛనప్రాయమే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *