mt_logo

టీ బిల్లుపై కేంద్రానికే సర్వ హక్కులు – పీకే.మహంతి

గురువారం సచివాలయంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సమావేశం నిర్వహించారు. తెలంగాణ బిల్లుపై సర్వహక్కులు కేంద్రానివేనని, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవని, తప్పొప్పులపై వివరణ ఇవ్వడమేకానీ, సవరణలు కోరే అధికారం లేదని ఆయన స్పష్టం చేశారు. బిల్లులో ఏవైనా అంశాలు తొలగించాలన్నా, చేర్చాలన్నా కేంద్రానికే పూర్తి అధికారం ఉందని, పొరపాట్లు ఉన్నా రాష్ట్ర ఏర్పాటు తర్వాతైనా సవరించుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని ముఖ్య కార్యదర్శులతో అన్నట్లు సమాచారం. అసెంబ్లీలో టీ బిల్లు చర్చకు వచ్చిన సందర్భంలో పలువురు సీమాంధ్ర నేతలు బిల్లుపై సమగ్ర నివేదికను అందించాలని కోరగా సీఎస్ స్పందించి కేంద్రాన్ని సంప్రదించగా, కేంద్ర హోంశాఖ బిల్లులో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయొద్దని సూచించింది. ఈ క్రమంలో బిల్లులో ఒక్క అక్షరం కూడా మార్చకుండా, తప్పులేవైనా ఉంటే వాటిని ఒక నోట్ రూపంలో నివేదించి ఈ నెల 21లోగా కేంద్ర హోం శాఖకు పంపే బాధ్యతను అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు సీఎస్ మహంతి అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *