mt_logo

ఆర్థిక మంత్రిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చిన బీఆర్ఎస్

తెలంగాణ అప్పులపైన శాసనసభను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిన ప్రభుత్వంపైన ప్రివిలేజ్ మోషన్‌కు అనుమతి ఇవ్వాలని కోరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ని కోరారు. భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం తరఫున ఆర్ధిక మంత్రిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు బీఅర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. అర్బీఐ నివేధికలో తెలంగాణ అప్పులు కేవలం రూ. 3.89 లక్షల కోట్లు అని స్ఫష్టం చేస్తే ప్రభుత్వం మాత్రం రూ. 7 లక్షల కోట్ల అప్పులు అంటూ తప్పుదోవ పట్టించినందున సభాహక్కులు నోటీలు ఇస్తున్నాం అని తెలిపారు.

అప్పులపై ఆర్ధిక మంత్రి గారి ప్రసంగం పూర్తిగా అవాస్తవం అని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ”హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్” పేరుతో విడుదల చేసిన నివేదిక నిరూపించింది అని అన్నారు.

2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ.72 వేల 658 కోట్లు ఉండగా, 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం రూపాయలు రూ. 3,89,673 కోట్లకు చేరిందని ఆర్‌బీఐ వెల్లడించింది. ఆర్ధిక మంత్రి గారు అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారు అని ఆరోపించారు.

కావున తెలంగాణ శాసనసభ కార్య విధాన మరియు కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం భారత రాష్ట్ర సమితి శాసనసభా పక్షం తరఫున ఆర్ధిక మంత్రి గారిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నాం అని ప్రకటించారు.