mt_logo

భూసేకరణపై సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సచివాలయంలో ఉన్నతాధికారులతో భూసేకరణపై సమీక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణకు అవసరమైన భూసేకరణ చట్టాన్ని రూపొందించాలని, భూసేకరణలో భూమిని కోల్పోయే వారికి అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు పునరావాస ప్యాకేజ్ వీలైనంత త్వరగా ఇవ్వాలన్నారు. మానేరు డ్యాం నిర్మాణం జరిగినప్పుడు తాము కూడా భూమిని కోల్పోయామని, ఆ బాధ తనకు తెలుసని, రిజిస్ట్రేషన్ విలువ కంటే ఎక్కువ మొత్తం నిర్వాసితులకు ఇవ్వాలని కేసీఆర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *