mt_logo

లండన్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ, దసరా సంబురాలు..

Telangana NRI Forum ఆధ్వర్యంలో లండన్ లో సద్దుల బతుకమ్మ-దసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు. హౌన్‌స్లాలోని లాంప్టొన్ స్కూల్ (Lampton School, Hounslow) ఆడిటోరియంలో జరిగిన ఈ సంబరాలకు యూకే నలుమూలల నుండి సుమారు వెయ్యికి పైగా తెలంగాణ కుటుంబసభ్యులు హాజరయ్యారు.

రంగురంగుల బతుకమ్మలతో తెలంగాణ ఆడపడుచులు సందడి చేశారు. విదేశాల్లో ఉన్నప్పటికీ సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి బతుకమ్మ ఆట ప్రారంభించారు. విదేశాల్లో స్థిరపడ్డాకానీ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరినీ ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటలో పాల్గొనడం కాకుండా, చిన్న చిన్న బతుకమ్మలతో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు…బతుకమ్మలని నిమజ్జనం చేసి.. తదుపరి సాంప్రదాయబద్దంగా సద్దుల ప్రసాదం ఇచ్చిపుచ్చుకున్నారు. స్వదేశం నుండి తెచ్చిన “శమిచెట్టు”కు ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సంవత్సరం కేవలం సంబరాలకే పరిమితం కాకుండా, మన తెలంగాణ ఆడబిడ్డ, జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో ఇచ్చిన పిలుపు మేరకు “అడాప్ట్ ఏ ఫార్మర్”(Adopt a Farmer) కార్యక్రమానికి మద్దతుగా ప్రత్యేక స్టాల్ ని ఏర్పాటుచేసి, హాజరైన అతిధులకు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు భరోసా కల్పించడానికి ప్రభుత్వం, ముఖ్యంగా కవిత గారు చేస్తున్న కార్యక్రమాలని వివరించడం జరిగింది. అలాగే బాధ్యత గల తెలంగాణ బిడ్డలుగా, నాటి ఉద్యమం నుండి నేటి పునర్నిర్మాణం వరకు అన్నింట్లో ముందున్న ఎన్నారై ఫోరమ్, రైతుల సహాయార్ధం, వేడుకల్లో సమకూరిన మొత్తాన్ని కవిత గారికి అందజేస్తునట్టు తెలిపారు. హాజరైన ప్రవాస బిడ్డలు రైతుల పట్ల సంస్థ బాధ్యతను ప్రశంసించారు.

భారత హై కమీషన్ ప్రతినిధి విజయ్ వసంతన్, బ్రిటన్ లోని పలువురు ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, రుత్ కాడ్బరీ, స్థానిక కౌన్సిలర్ ప్రీతం మరియు ఇతర ప్రవాస భారత సంఘాల ప్రతినిధులు వేడుకలో పాల్గొన్న వారిలో ఉన్నారు. హాజరైన అతిథులు, సంస్థ చేసిన గొప్ప సాంస్కృతిక సంబరం ఎంతో స్పూర్తినిచ్చిందని, విదేశీ గడ్డపై ఇంత ఘనంగా బారతీయ సంస్కృతిని, ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని ప్రపంచానికి చాటుతున్న తీరు గొప్పగా ఉందని ప్రశంసించారు.

అతిథులుగా వచ్చిన స్థానిక మహిళా ఎంపీలు ప్రవాస తెలంగాణ బిడ్డలతో కలిసి బతుకమ్మ-కోలాటం ఆడి, సందడి చేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. తెలంగాణ ఎన్నారై ఫోరమ్ సంస్థ కొన్ని రోజుల ముందు నిర్వహించిన చారిటీ క్రికెట్ మరియు వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు అతిథులు బహుమతులు అందించారు.

ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి- లయా రూపేష్, ద్వితీయ– స్వప్న మరియు తృతీయ- మీనాక్షి అంతటి అవార్డు గెలుచుకున్న వారిలో ఉన్నారు. రాఫెల్ లో బంగారు బహుమతులు గెల్చుకున్నవారిలో ప్రథమ- రాజు, ద్వితీయ- అన్వేష్, తృతీయ- గోపి ఉన్నారు. తెలంగాణ కుటుంబాలు ఇలా ఒక్కదగ్గర కలుసుకొని పండగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని హాజరైన వారందరూ అభిప్రాయపడ్డారు.

అధ్యక్షులు సిక్క చందుగౌడ్, ఉపాధ్యక్షులు పవిత్ర రెడ్డి కంది, ఈవెంట్స్ ఇన్‌ఛార్జ్ నగేష్ రెడ్డి కాసర్ల ఆద్వర్యంలో జరిగిన వేడుకల్లో TeNF- వ్యవస్థాపక సభ్యులు ఎన్నారై టీ.ఆర్.యస్ సెల్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, అడ్వైజరీ బోర్డ్ ఛైర్మన్ ఉదయ్ నాగరాజు, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు- సుధాకర్ గౌడ్ & రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డ్ సభ్యులు ప్రమోద్ అంతటి, కోశాధికారి అశోక్ గౌడ్ దూసారి & వెంకట్ రెడ్డి, మహిళా విభాగం ఇన్‌ఛార్జ్ సుమాదేవి, సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జ్ అర్చన జువ్వాడి, స్పోర్ట్స్ ఇన్‌ఛార్జ్ నవీన్ రెడ్డి, నరేశ్ కుమార్, మీడియా సెక్రటరీ మల్లారెడ్డి, కల్చరల్ కో ఆర్డినేటర్ సుష్మణ రెడ్డి, స్వాతి, మీనాక్షి, నిర్మల, శౌరి, స్వప్న ఈవెంట్ కమిటీ సభ్యులు మంద సునీల్ రెడ్డి, శివాజీ షిండే, రేకుల విక్రమ్ రెడ్డి, రాజేష్ వర్మ, శ్రీకాంత్ జెల్ల, వంశీ చిట్టి, స్వామి ఆశ, సత్యం కంది, సునీల్, మహేష్, రంగు వెంకట్, వాణి తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *