బాల్కొండ నియోజకవర్గం మరో గోల్కొండ ఖిల్లా లాంటిదని, ఎవరెన్ని ఎత్తులు వేసినా టీఆరెస్ ముందు చిత్తు కాక తప్పదని, వేల్పూరు మండలం లక్కోరలో జరిగిన సమావేశంలో నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లాకు వున్న ప్రత్యేకతను ఆమె వివరించారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు నిజామాబాద్ జిల్లాలోనే వున్నారని అన్నారు. అలాగే మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి రాక కూడా పార్టీకి అదనంగా కలిసివచ్చే అంశం అన్నారు. ఆనాడు ఎంతో మంది రాజులు గోల్కండ కోటను వశపరచుకోడానికి ప్రయత్నించి విఫలమయ్యారో, అట్లనే టీఆరెస్ పార్టీని కూడా ఎవరూ ఓడించలేరని అన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇక్కడి గ్రామాలకు కావలసిన సౌకర్యాల గురించి , రైతన్నల అవసరాలు, అభివృద్ధి ఎలా జరగాలో అనే విషయాల గురించి తరచూ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చిస్తూ, పెద్ద ఎత్తున నిధులు తీసుకు వస్తున్నారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి అనుచరులు 500 మంది ఎంపీ కవిత సమక్షంలో టీఆరెస్ లో చేరారు.
- Series of food poisoning incidents in Telangana residential institutions a big concern
- Principals’ negligence and funds misappropriation plaguing Gurukuls in Telangana
- Elephant fear grips north Telangana; 60-70 elephants might enter from Maharashtra
- People fed up with Congress misrule, says KCR
- KCR advises BRS leaders to focus on social media
- నిర్మల్ జిల్లా కేజీబీవీ పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనపై స్పందించిన హరీష్ రావు
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గళం.. నాగర్కర్నూల్కు బలం: కేటీఆర్
- పాలమూరుకు పట్టిన దరిద్రమే కాంగ్రెస్ పార్టీ: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- కాంగ్రెస్ నాయకుల మధ్య అబద్ధాల పోటీ జరుగుతుంది: హరీష్ రావు
- కేసీఆర్ బస్సు యాత్ర కోసం ఈసీని అనుమతి కోరిన బీఆర్ఎస్
- కపటనీతికి మారుపేరు కాంగ్రెస్.. యువతకు కాంగ్రెస్ చేసిన ద్రోహంపై కేటీఆర్ ధ్వజం
- అహంకారంతో కళ్లు నెత్తికెక్కిన కాంగ్రెస్ నేలకు దిగిరావాలంటే వినోదన్న గెలవాలి: హరీష్ రావు
- 2001 లోనే హైదరాబాద్లో గులాబీ జెండా ఎగురవేసిన నాయకుడు పద్మారావు గౌడ్: కేటీఆర్
- కాంగ్రెస్కి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం: కేటీఆర్
- ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణించడం దురదృష్టకరం: హరీష్ రావు