mt_logo

సన్నబియ్యంతో హాజరుశాతం పెరిగింది – ఈటెల

శాసనసభలో ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం సరఫరా చేయడంతో పాఠశాలల్లో పిల్లల హాజరు శాతం పెరిగిందని చెప్పారు. గతంలో హాస్టళ్ళలో పురుగుల అన్నం, నీళ్ళ చారు పెట్టారని, కానీ తాము చదువుకునే పిల్లలు కడుపునిండా తినడానికి సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని మంత్రి తెలిపారు. సన్న బియ్యంతో భోజనం పెడుతున్నందుకు ప్రభుత్వానికి అన్ని వర్గాల నుండి మన్ననలు లభించాయని పేర్కొన్నారు. జనవరి 1, 2015 నుండి హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని, 2,757 హాస్టళ్ళలో ఉన్న 4,80,926 మంది విద్యార్థులు, 34,319 ప్రభుత్వ పాఠశాలల్లో 29,86,010 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *