mt_logo

ఏపీకి తెలంగాణ సాయం..

హుదూద్ తుఫాను ప్రభావంతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తెలంగాణ సర్కార్ ముందుకొచ్చింది. ఐదుగురు ఐఏఎస్ లను తుఫానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు కేటాయించింది. సీఎం సూచనల మేరకు ఏ విధమైన సహకారం అందించాలనే దానిపై సీఎస్ రాజీవ్ శర్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ క్రిష్ణారావుతో సంప్రదింపులు జరిపారు. ఏపీ విపత్తు నిర్వహణ కమిషనర్ తో కలిసి సమన్వయంతో ముందుకుపోతూ ఐఏఎస్ లు ఐదుగురూ సహాయక చర్యల్లో పాల్గొంటారని, ఏపీ సీఎస్ కృష్ణారావు వద్ద రిపోర్టు చేయాలని వారిని ఆదేశించినట్లు రాజీవ్ శర్మ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *