mt_logo

రాష్ట్రంలో సంవత్సరం పొడవునా ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమాలు

ఆజాదీ కా అమృతోత్సవ్ ను పురస్కరించుకొని ఈ నెల నుండి సంవత్సరం పాటు రాష్ట్రంలో పలు సాంస్కృతిక, చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమాల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వసాంస్కృతిక శాఖ కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సి.ఎస్.సోమేశ్ కుమార్ మాట్లాడుతూ..దేశ 75వ స్వాతంత్ర సంవత్సరం సందర్బంగా ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తి కలిగించడానికి రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగా రాష్ట్రంలో 75 ప్రాంతాలనుండి ఒక్కొక్క బృందం 75 కిలోమీటర్లు సాగే విధంగా సైకిల్ ర్యాలీలను నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే 75 ఏళ్ల స్వాతంత్రోద్యమంపై స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నామని, తెలంగాణలో జరిగే అతిపెద్ద పండగైనా బతుకమ్మ పండగ ను కూడా 75 ఏళ్ల స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని కలిగించేదిగా నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పలు సాంస్కృతిక సారధి బృందాలతో పాటు ఐ.టి.రంగం, తెలుగు సినిమా పరిశ్రమలతో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని సి.ఎస్. పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర ప్రభుత్వ విద్యా శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *