mt_logo

11 వ అంతర్జాతీయ మేయర్ల సదస్సు ప్రారంభం

హెచ్ఐసీసీ లో నేటి నుండి 10 వ తేదీవరకు జరగనున్న 11 వ అంతర్జాతీయ మెట్రో పోలిస్ ప్రపంచ మేయర్ల సదస్సు ఈరోజు ఉదయం ప్రారంభమైంది. ఈ సదస్సులో 10 కీలక అంశాలపై చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో మొదటి రోజు వాయిస్ ఆఫ్ చిల్డ్రన్ కార్యక్రమం జరుగుతున్నది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ సదస్సుకు మంగళవారం గవర్నర్ హాజరై ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అదేరోజు ముఖ్య అతిథిగా హాజరౌతారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి అంతర్జాతీయ సదస్సు కావడంతో రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది. 9వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముగింపు ఉపన్యాసం చేస్తారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకు చెందిన 400 మంది విదేశీ ప్రతినిధులు, దేశంలోని వివిధ నగరాల నుండి 1653 మంది మేయర్లు పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *