
ఆకలైనప్పుడు అన్నం పెట్టడం చేతకాని కాంగ్రెస్కు ఓట్ల కోసం గోరిముద్దలు తినిపిస్తామంటే ప్రజలు నమ్మరు అని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన మైనార్టీ బంధు, బీసీ బంధు లబ్ధిదారులతో పాటు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అదేవిధంగా జీ.వో నెంబర్ 58, 59 ద్వారా లబ్ధిదారులకు రెగ్యులరైజేషన్ మంజూరు పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి,పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు గారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి పండుగ జరుగుతుంది. నిన్న ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. ఈరోజు పాలమూరు ప్రాజెక్ట్ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా ఒక రూపాయి అప్పు లేకుండా నేరుగా లక్ష రూపాయలు బీసీ బంధు కింద ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కి ధన్యవాదాలు. వర్గాలను అభివృద్ధి చేయాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ బంధు పథకాన్ని అమలు చేస్తున్నాను. బీసీల సంక్షేమంతో పాటు అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రికి కేసీఆర్ చేపట్టారు అని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలను బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసింది. మైనార్టీల సంక్షేమం పాటుపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మైనార్టీలు సురక్షితంగా ఉన్నారంటే అది తెలంగాణలోనే బీజేపీ పాలిత ప్రాంతంలో మైనార్టీలు అభద్రత భావంతో ఉన్నారు అని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీ సంక్షేమంతో పాటు మైనార్టీ విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ పాఠశాలను కళాశాలలను ప్రారంభించారు. కర్ణాటకలో ముస్లిం మైనార్టీలు 90 లక్షల మంది ఉన్నారు. మహారాష్ట్రలో కోటి 50 లక్షల మంది ఉన్నారు. బెంగాల్లో రెండు కోట్ల 55 లక్షల మంది అదే విధంగా ఉత్తరప్రదేశ్లో నాలుగు కోట్ల మంది ముస్లిం మైనార్టీలు ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో 2 వేల కోట్లకు మించి ముస్లిం మైనార్టీల కోసం బడ్జెట్ కేటాయించలేదు. అదే తెలంగాణ లో 50 లక్షల మంది ముస్లిం మైనార్టీలు ఉంటే వారి కోసం రెండు వేల కోట్ల బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్కి ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ఎంత కట్టుబడి ఉన్నారనేది ఆలోచించండి అని పేర్కొన్నారు.

కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్కి 11 వేల 130 కోట్లు
హిందువులైనా, ముస్లింలైనా అందరికోసం పనిచేసే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మాదిరి పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఇస్తలేదు. ఇప్పటి వరకు 12,71,000 మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించారు ముఖ్యమంత్రి కేసీఆర్. 11,130 కోట్ల రూపాయలు ఇప్పటివరకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్కి రాష్ట్ర ప్రభుత్వం అందించింది అని తెలిపారు
ఛత్తీస్గడ్, ఒడిశా రాష్ట్రాల కరెంటు వాడకం కంటే హైదరాబాద్ కరెంటు వాడకం ఎక్కువ. తెలంగాణ రాకముందు హైదరాబాద్లో 2000 మెగావాట్ల వినియోగంలో ఉంటే ఈరోజు 6000 మెగావాట్లు పెరిగింది. నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన కరెంటును అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని అన్నారు.
పటాన్ చెరు వరకు మెట్రో రైల్
పటాన్చెరు వరకు మెట్రో రైల్ కూడా త్వరలో రానుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించారు. మళ్లీ పటాన్చెరులో గూడెం మహిపాల్ రెడ్డి గారిని గెలిపించాలి. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్కి ఆశీర్వదించాలి అని అన్నారు.
60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి చేయడం చేతకాలేదు ఇప్పుడు చేస్తామంటే నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ఆకలైనప్పుడు అన్నం పెట్టడం చేతకాని కాంగ్రెస్కు అవసరానికి గోరిముద్దలు తినిపిస్తామంటే ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ పార్టీకి చేతనైతే అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో తెలంగాణకు మించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి చూపించాలి అని సవాల్ విసిరారు.