mt_logo

మాతా శిశు మరణాలు తగ్గించడంలో తెలంగాణ దేశంలోనే  నెంబర్ 1

  • హెల్త్ హబ్ గా తెలంగాణ అభివృద్ధి చెందింది
  • గ్లోబల్ సిటీ గా హైదరాబాద్ ఎదిగింది
  • ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ లో తెలంగాణ దేశంలో నెంబర్ 1

రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు MNJ కేన్సర్ ఆసుపత్రిలో పేషెంట్ కేర్, సెక్యూరిటీ, వంటి విషయాల వ్యయం రెండేళ్ల పాటు తామే భరిస్తామని ముందుకు వచ్చారు. ఆస్కార్ సాధించడం పట్ల  రాజమౌళిని మంత్రి హరీశ్ రావు సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. రాజమౌళి గారి సినిమాలో ప్రేరణ కనిపిస్తుంది. దేశ భక్తి, సామాజిక స్పృహ కనిపిస్తుంది అని అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.బంజారాహిల్స్ లో లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు, ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి

అంతకుముందు మాట్లాడిన రాజమౌళి గారు మంత్రి హరీశ్ రావు పనితీరు పై ప్రశంసలు కురిపించారు. సిద్దిపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది అన్నారు. తాను చూసిన నాటికి ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందన్నారు. పని తీరు చూసిన నాటి నుండి హరీశ్ రావు గారికి తాను పెద్ద అభిమానిగా మరానని రాజ మౌళి గారు చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. హెల్త్ హబ్ గా తెలంగాణ అభివృద్ధి చెందింది, గ్లోబల్ సిటీ గా హైదరాబాద్ ఎదిగింది. సీఎం కేసీఆర్ గారి మార్గనిర్దేశంలో హైదరాబాద్ అభివృద్ధి చెందింది, అదే విధంగా ఆరోగ్య రంగంలో అభివృద్ధి చెందిందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు, 10 వేల పడకల సూపర్ స్పెషాలిటీ పడకలు ఏర్పాటు చేస్తున్నాం,  నీతి అయోగ్ నివేదిక ప్రకారం దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో ఉందన్నారు. సూపర్ స్పెషాలిటీ MCH లను గాంధీ, నిమ్స్ లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

వచ్చే నెలలో గాంధీలో ప్రారంభం అవుతుంది

కార్పొరేట్ ఆసుపత్రులతో తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు పోటీ పడుతున్నాయన్నారు. 2014 లో ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు 30 శాతం ఉంటే, గత నెల 70 శాతం చేరాయి,  ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ లో తెలంగాణ దేశంలో నెంబర్ 1 ఎనీమియా తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 14 నుండి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందించబోతున్నమని తెలిపారు. మాతా శిశు మరణాలు తగ్గించడంలో తెలంగాణ దేశంలో నెంబర్ 1 గా ఉంది. వంద శాతం ఆసుపత్రి డెలివరీలు జరుగుతున్నాయి.. అనవసర సి సెక్షన్లు తగ్గించడంలో ప్రైవేటు ఆసుపత్రులు తోడ్పాటు అందించాలన్నారు. అనవసర సి  సెక్షన్ల వల్ల అనేక ఇబ్బందులు ఉంటాయి. నాడు పేదలు రొట్టెలు తింటే, ధనికులు అన్నం తిన్నరు. నేడు అది రివర్స్ అయ్యింది,  ఈ ఆసుపత్రి కూడా ప్రజలకు తక్కువ ఖర్చుతో మంచి వైద్య సేవలు అందించాలన్నారు.