mt_logo

చెట్లను సంరక్షించుకోవడం మనందరి బాధ్యత

  • సీఎం కేసీఆర్ వల్ల రాష్ట్రంలో పచ్చదనం పెరిగింది
  • హరితహారం గొప్ప కార్యక్రమం

వేల్పూర్: సరిగ్గా 8 సంవత్సరాల క్రితం (6-7-2015) వ తేదీన  మొదటి విడత హరితహారం లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి ఆవరణలో నాటిన మొక్క నేడు 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9 వ సంవత్సరం లోకి అడుగిడిన సందర్భంగా ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి చెట్టుకు పుట్టిన రోజు వేడుకలు జరిపిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం చాలా గొప్ప నిర్ణయం అని అన్నారు.

ఇది ఓట్ల కోసం చేసేది కాదని భావితరాల భవిష్యత్తు కోసం చేపట్టిన కార్యక్రమం అని వెల్లడించారు. ప్రపంచం మొత్తం అడవుల శాతం తగ్గిపోతుంటే మన తెలంగాణ లో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చర్యల వల్ల 7.7 శాతం అడవులు పెరిగాయి అని తెలిపారు. మొక్కలు సంరక్షించడం నాటడం మన అందరి బాధ్యత అని మంత్రి గుర్తు చేశారు. మొక్కలు నాటడం వలన సకాలంలో వర్షాలు కురుస్తాయని మంత్రి పేర్కొన్నారు.