mt_logo

సిద్దిపేటలో 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

  • ప్రాథమిక చికిత్స నుండి ప్రాణాంతక వ్యాధుల వరకు అన్ని వైద్య సేవలు అందించబడతాయి. 
  • ఒకప్పుడు మనం నీళ్లు చూడనోళ్లం..కానీ ఇప్పుడు కరువు ఎరగనోల్లం
  • స్టాఫ్ నర్స్‌ల పేరు మారుస్తూ నర్సింగ్ డాక్టర్ గా పిలుస్తూ ఉత్తర్వులు జారీ.
  • 23 కోట్లతో 50 పడకల సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ బ్లాకు ఏర్పాటు చేయబోతున్నాం..

సిద్దిపేటలో మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నూతనంగా నిర్మించిన 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ నిర్మించడం వల్ల కార్మికుల పిల్లలు, పేద పిల్లలు ఈరోజు డాక్టర్లుగా తయారవుతున్నారు. 175 సీట్లు సిద్దిపేట మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు పొందుతారు. ఇందులో 25% అంటే 25 సీట్లు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి చదువుతున్న వారున్నారు. 

ఢిల్లీ రాజస్థాన్ లాంటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుతున్నారంటే తెలంగాణ అభివృద్ధి ఏంటో అర్థం అవుతుంది. గతంలో సిద్దిపేట మెడికల్ కాలేజ్ నుంచి మెరుగైన వైద్యం కోసం గాంధీ, ఉస్మానియా ఆస్పత్రికి పంపించేవారు కానీ ఇకపై నుండి ఇక్కడే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయని తెలిపారు. నూతన క్యాన్సర్ బ్లాక్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇకనుండి క్యాన్సర్ చికిత్స కూడా ఇక్కడే అందించబడుతుంది. ఈ ఆసుపత్రిలో 40 పడకల డయాలసిస్ కేంద్రం ఏర్పాటు.

15 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అందులో 8 మార్జిలర్ ఆపరేషన్ థియేటర్లు నిర్మించుకున్నాం. 100 ఐసీయూ బెడ్‌లు పూర్తి సామర్ధ్యంతో సేవలు. ప్రైవేట్‌కు దీటుగా వైద్య సేవలు ఉంటాయన్నారు. 30 పడకలతో ఎమర్జెన్సీ వార్డు. 23 కోట్లతో 50 పడకల సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ బ్లాక్ ఏర్పాటు చేయబోతున్నాం. 875 మంది వైద్య విద్యార్థులు ఉంటారు. 13 డిపార్ట్మెంట్ లో పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరో 3 నూతన పీజీ సీట్లు ఏర్పాటు. ప్రతి ఏడాది 62 మంది పీజీ విద్యార్థులకు కూడా చదివే అవకాశం ఉందన్నారు.  సంపన్నుల పిల్లలే డాక్టర్ చదువు చదవాలన్న నానుడిని మారుస్తూ రైతులు, కూలీల పిల్లలు కూడా ఎంబీబీఎస్ చేసే అవకాశం ఇచ్చాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేసారు.

స్టాఫ్ నర్స్ ల పేరు మారుస్తూ నర్సింగ్ డాక్టర్ గా పిలుస్తూ ఉత్తర్వులు జారీ. నర్సింగ్, బి ఫార్మసీ కాలేజ్ లు సిద్దిపేటలో ఉన్నాయి. 280 మంది డాక్టర్‌లు 24 గంటలు సేవలు అందిస్తారు. వీరితోపాటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న 150 మంది డాక్టర్లు కూడా సేవలు అందిస్తారు. ప్రాథమిక చికిత్స నుండి ప్రాణాంతక వ్యాధుల వరకు అన్ని వైద్య సేవలు అందించబడతాయి. ఒకప్పుడు మనం నీళ్లు చూడనోళ్లం..కానీ ఇప్పుడు కరువు ఎరగనోల్లం, ఒక ప్రాంతానికి కావాలిసిన కలలను సాకారం చేసుకున్నాం. సిద్దిపేట జిల్లా చేసుకున్నాం, సిద్దిపేట కు గోదావరి నీళ్లు తెచ్చుకున్నాం, సిద్దిపేటకి రైల్ కూడా తెచ్చుకున్నాం అని తెలిపారు. 1000 పడకల ఆస్పత్రి మనకు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు, సిద్దిపేట ప్రజలందరికీ శుభాకాంక్షలని పేర్కొన్నారు.