mt_logo

మోదీకి రాహుల్ గుత్తేదారు: మంత్రి జగదీష్ రెడ్డి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ రాహుల్ లీడర్ కాదు రీడరని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రెండు సార్లు ఏఐసీసీ అధ్యక్ష పదవిని అర్ధాంతరంగా వదిలి పెట్టారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ. రాసిచ్చింది చదవడమే ఆయన చేస్తున్న పని. నిన్నా, మొన్నా గల్లీ లీడర్లు మాట్లాడిన మాటలే ఆయన ఉటంకించారు. రాహులే మోడీకి గుత్తేదారు. నాలుగు వేల పింఛన్ ఏ హోదాలో ప్రకటించారు అని ప్రశ్నించారు. 

పింఛన్ ప్లకార్డులు రాహుల్ తెలిసి పట్టుకున్నారా తెలియక పట్టుకున్నారా?

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్న పింఛన్ ఎంత?  పింఛన్ ప్లకార్డులు రాహుల్ తెలిసి పట్టుకున్నారా తెలియక పట్టుకున్నారా? నాలుగు వేల పింఛన్ ఇచ్చేది నిజమే అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదు అని అడిగారు. కాంగ్రెస్ పార్టీని కొనఊపిరితో బతికిస్తున్న చత్తీస్ ఘడ్ లో వృద్ధులకు ఇచ్చేది 350 రూపాయలే.. అదే రాష్ట్రంలో వికలాంగులకు 500,వితంతువులకు ఇచ్చేది 350. అదే పార్టీ ఏలుబడిలో ఉన్న రాజస్థాన్ లోనూ వృద్ధులకు ఇచ్చేది 750,వికలాంగులకు 750,వితంతువులకు 550 మాత్రమే. సచ్చిపోతుందనుకున్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిన కర్ణాటక లోనూ ఇచ్చేది అంతకంటే ఎక్కువ లేదు.  కర్ణాటకలో వృద్దులకు  800,వికలాంగులకు 800, వితంతువులకు 800 రూపాయలే.. కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించిన కర్ణాటకలో,కోన ఊపిరితో ఉన్న చత్తీస్ ఘడ్ లో,పార్టీని నిలబెట్టిన రాజస్థాన్ లో 4,000 పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదు అని మండిపడ్డారు.

ఆరోపణలు చేయడం రాహుల్ అజ్ఞానం

అందుకే ఆయనను లీడర్ గా కాకుండా రీడర్ గానే చూడాల్సి వస్తుంది. గల్లీ నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివి వినిపించారు. అది కూడా ఆయన ఏ హోదాలో ప్రకటించారు అన్నదే హాస్యాస్పదంగా మారింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వని ఫింఛన్లు తెలంగాణలో ఇస్తామని ప్రకటించడానికి సిగ్గు ఉండాలి. 4,000 పింఛన్ ప్రకటనను ఇక్కడి ప్రజలకు నమ్మశక్యంగా లేదన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు 4,000,వితంతువులకు 2016,వృద్ధులకు 2,016 ఇస్తున్నారు, కాళేశ్వరం కట్టిందే లక్ష కోట్లతో కట్టిన మొత్తంలో స్కామ్ జరిగిందంటూ ఆరోపణలు చేయడం రాహుల్ అజ్ఞానాన్ని బయట పడేసింది. కాళేశ్వరం కట్టింది నిజమో కాదో తెలియడానికి రాహుల్ మెడిగడ్డ మీద నుండి దూకితే తెలుస్తుందని అన్నారు.