mt_logo

ప్రొఫెసర్ల వయోపరిమితి పెంపు

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులకు మంత్రి హరీశ్ రావు ఆదేశాలు జారీచేశారు.  

మంత్రి హరీశ్ రావు ఆదేశాలు ఇవే.. 

– టీచింగ్ ఆసుపత్రుల్లో 190 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలి. కౌన్సిలింగ్ పూర్తి చేసి వెంటనే పోస్టింగ్ లు ఇవ్వాలి.

-ప్రొఫెసర్ నుండి అడిషనల్ డీఎంఈ గా పదోన్నతి పొందేందుకు వీలుగా వయోపరిమితి 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లకు పెంచాలని నిర్ణయం. అడిషనల్ డీఎంఈ పదోన్నతి ప్రక్రియ వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని మంత్రి ఆదేశం. 

-ప్రొఫెసర్ల బదిలీల విషయంలో ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి కి మంత్రి హరీశ్ రావు ఆదేశం. 

-తెలంగాణ వైద్య విధాన పరిషత్ లోని మొత్తం 112 డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ సర్జన్ పదోన్నతుల ప్రక్రియ వెంటనే చేపట్టాలి, 15 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశం.

-తెలంగాణ వైద్య విధాన పరిషత్ లోని 371 నర్స్ ప్రమోషన్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలి. వచ్చే 10 రోజుల్లో లోకలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి, నెల రోజుల్లో ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి చేయాలి. 

-అదే విధంగా ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, వీడియోగ్రాఫర్స్ సంబంధించిన పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.

-డెంగ్యూ పరీక్ష నిర్ధారణ కోసం ఉపయోగించే 32 సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ మిషన్లను రూ. 10 కోట్లతో వెంటనే కొనుగోలు చేసి, అన్ని జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. వీటి ఏర్పాటు వల్ల సకాలంలో రోగనిర్ధారణ జరిగి సత్వరం అందించడం జరుగుతుంది. 

-పి.ఎం.పి, ఆర్ఎంపీ లకు శిక్షణ ఇచ్చే విషయంపై వైద్యాధికారులతో మంత్రి హరీశ్ రావు ముఖ్య ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాలకు లోబడి వారికి శిక్షణ ఇచ్చే అంశంపై పూర్తి నివేదిక రూపొందించేలా కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించారు. 

-ఈ ఏడాది ప్రారంభించే మెడికల్ కాలేజీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ సారించాలని, ఈ ఏడాది నుండి తరగతులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

-నిమ్స్ నూతన బిల్డింగ్ నిర్మాణం సంబంధించిన పనులు వేగవంతం చేయాలన్నారు. 

-కొత్తగా సమకూర్చుకున్న 228 అమ్మఒడి వాహనాలు, (204) 108 వాహనాలు, 34 హర్సే వాహనాలను ఆగస్టు 1 వ తేదీన ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.