![](https://i0.wp.com/missiontelangana.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-01-at-3.08.01-PM.jpeg?resize=1024%2C576&ssl=1)
గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా ఇతర విద్యార్థి నాయకులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి తీవ్రంగా ఖండించారు.
నిరుద్యోగుల డిమాండ్లు పరిష్కారించాల్సింది పోయి, పరామర్శించేందుకు వస్తున్న వారిని అడ్డుకోవడం అప్రజాస్వామికం అని పేర్కొన్నారు. ఇదేనా ప్రజా పాలన అని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన నాయకులకు నిరుద్యోగుల ఆవేదన ఎందుకు అర్థం కావడం లేదు అని హరీష్ అడిగారు. అక్రమ అరెస్టులు చేసిన వారిని తక్షణం వదిలిపెట్టాలని, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.