mt_logo

కాంగ్రెస్ అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్: మంత్రి కేటీఆర్

ఇంటింటికి మంచినీళ్లు,  ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటరేమో ? అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.  అందులో కూడా కేసీఆరే కనిపిస్తడు కదా? అని అడిగారు. కాంగ్రెస్ అంటేనే… రైతు విరోధి అని, మరోసారి రుజువైపోయిందని తన ట్విట్టర్ X వేదికగా మంత్రి స్పష్టం చేశారు. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్  కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయిందన్నారు. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరని తేల్చి చెప్పారు. 

అన్నదాతల పొట్టకొట్టే.. కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరని తెలిపారు. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా అన్నారు. ఇప్పటికే.. నమ్మి ఓటేసిన పాపానికి… కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నరని భాద పడ్డారు. తెలంగాణ రైతులకు.. కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక, మూడు గంటల మోసానికి తెర తీశారని అన్నారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌కు  తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.