మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామారెడ్డికి మద్దతుగా, దుబ్బాకలో నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఢిల్లీలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ బీడీ కట్టలు పట్టల మీద పుర్రె గుర్తు పెడితే, బీజేపీ బీడీ కట్టల మీద పన్ను వేశారు.. కేసీఆర్ మాత్రం బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చారు. 30 ఏళ్లు బీడీలు చేస్తేనే ఫించన్ ఇస్తామని నిబంధన పెట్టారు అని తెలిపారు.
దుబ్బాక స్కూల్లో కేసీఆర్ చదువుకున్నడు.. ఇక్కడి ప్రజల కష్టం తెల్సు. కాంగ్రెస్ వాళ్లు జూటా మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారు. రుణమాఫీ లేదు.. రైతుబంధు లేదు.. రైతు బీమా లేదు.. కళ్యాణ లక్ష్మి లేదు.. 24 గంటల కరెంటు లేదు అని విమర్శించారు.
బీజేపీ అభ్యర్థి మళ్ళీ వస్తున్నాడు.. మరోసారి బుద్ధి చెప్పాలి. విద్యావంతుడు గెలవలా.. బ్లాక్మెయిలర్ గెలవాలా.. రేవంత్ రెడ్డి కేసీఆర్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అడ్డిమార్ గుడ్డి దెబ్బ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు.. అంత అహంకారం ఎందుకు అని దుయ్యబట్టారు.
బీజేపీ అదాని, అంబానీలను పెంచి పోషించింది.. పేదలను మాత్రం మరిచిపోయింది. బీజేపీ వాళ్లకు చెప్పుకోవడానికి ఏం లేక చిత్ర పటాలు పంచుతున్నారు. దుబ్బాక గడ్డ మీద కారు జోరు కొనసాగాలి అని కోరారు.
రూ. 100 కోట్లతో సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలిపించాలని కోరుతున్నాను అని హరీష్ రావు పిలుపునిచ్చారు.
- Congress govt’s apathy in paddy procurement distressing Telangana farmers
- KTR goes all guns blazing; poses several questions to PM Modi
- Hyderabad is collapsing due to Congress ruling: KTR
- Congress, BJP to draw blank, BRS to win 3, and MIM to win 1 LS seat in GHMC
- Rahul Gandhi misled Telangana by claiming Congress govt. giving Rs. 2,500 to women: KTR
- ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సరైన ఛాయిస్ రాకేష్ రెడ్డి: కేటీఆర్
- కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుంది.. రేపు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసనలు
- ప్రభుత్వాన్ని నడపడం చేతగాని రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ ఉద్యోగులను తిడుతున్నాడు: కేటీఆర్
- తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై రేవంత్ నిరాధార ఆరోపణలు: హరీష్ రావు
- రాజకీయాలను పక్కనపెట్టి రైతన్నలను ఆదుకోవాలి.. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి: కేటీఆర్
- కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ.. ఇరు పార్టీలకు బీఆర్ఎస్ ముచ్చెమటలు పట్టించింది: కేటీఆర్
- బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు, తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్
- మైనార్టీల కోసం 204 పాఠశాలలు పెట్టిన రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉందా: మైనార్టీల సమావేశంలో కేటీఆర్
- పెద్దపల్లిలో ఆగర్భ శ్రీమంతుడుకి, భూగర్భ కార్మికుడికి.. ఈశ్వరునికి, కోటీశ్వరునికి.. గుణవంతునికి, ధనవంతునికి మధ్య పోటీ: కేటీఆర్
- అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప.. బండి సంజయ్ చేసిందేమి లేదు: కేటీఆర్