mt_logo

తెలంగాణ నేడు దేశానికే దిక్సూచి : మంత్రి హరీష్ రావు

తెలంగాణ పై బీజేపీ ఢిల్లీలో అవార్డులు గల్లీలో విమర్శలు చేస్తారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా  సంగారెడ్డి జిల్లా సుపరిపాలన దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో  తెలంగాణ ఇస్తే.. నక్సలైట్ల రాజ్యం వస్తుంది.. ప్రతి రోజూ కర్ఫ్యూ ఉంటది అని అన్నారు.పరిపాలన చేత కాదు.. విద్యుత్ ఉండదు అని అన్నారు.కానీ 9సంవత్సరాల కేసీఆర్ పాలన అవన్నీ తప్పు అని నిరూపించిందన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల ఆరోపణల తప్పు అని కేసీఆర్ నిరూపించారు. అన్ని రంగాల్లో 24 గంటల విద్యుత్ తో తెలంగాణ వెలుగుల జిలుగు గా మారింది,  అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ సుపరిపాలన అందిస్తున్నారు, తెలంగాణ నేడు దేశానికే దిక్సూచిగా నిలుస్తోందన్నారు. తెలంగాణలో అవలంభిస్తున్న విధానాలు, అమలు చేస్తున్న పథకాలు దేశం మొత్తం అమలు చేస్తున్నారు. సుపరిపాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శం. నిరంతర కరెంట్ తో పరిశ్రమల అభివృద్ధి, నాడు ఏ కారణాలు అయితే చెప్పి తెలంగాణను అడ్డుకున్నారో..ఎలాంటి అనుమానాలు పెట్టారో..  తెలంగాణను వ్యతిరేకించి నేను తప్పు చేసిన అని లగడపాటి రాజగోపాల్ అన్నరు, తెలంగాణ అభివృద్ధిని చూసి ఆయన అలా అని అంటారన్నారు. మనం కిందపడితే నవ్వే వాళ్ళు.. కానీ కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు తల ఎత్తుకునేలా చేశారు.తెలంగాణ పేరు దేశ వ్యాప్తంగా మారు మోగేల చేశారు.

దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు సంఘం లేదు

ఆన్ లైన్ ఆడిట్ లో నెంబర్ 2 తెలంగాణ. కేంద్రం మంత్రుల సబ్ కమిటీ వేసి మన మోడల్ దేశ వ్యాప్తంగా చేయాలని చూస్తున్నారు, మన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికి రోల్ మోడల్ అయ్యాయి. చిన్న జిల్లాలు ఏర్పాటు, కలెక్టర్లు పెరగడం వల్ల ప్రజలకు మంచి సేవలు అందుతున్నాయన్నారు. కొత్త జిల్లా తర్వాత 769 కొత్త అధికారులు ఒక్క సంగారెడ్డి జిల్లాలో వచ్చారు.ఏళ్ల తరబడి కొట్లాడినా మండలాలు ఇవ్వలేదు. కానీ సీఎం కేసీఆర్ 9 కొత్తవి ఇచ్చారన్నారు. 190 కొత్త గ్రామ పంచాయతీలు చేసుకున్నాం, తండాలు పంచాయతీలు చేస్తా అని కాంగ్రెస్ మానిఫెస్టో లో పెట్టీ మోసం చేసిందన్నారు. ఈ దేశంలో అందరికీ సంఘం ఉంది. కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు సంఘం లేదు, 116 రైతు వేదికలు ఈ జిల్లాలో ప్రారంభించాం.. మహారాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వచ్చి ఇక్కడి పథకాలు చూసి ఆశ్చర్యపోయారు, తెలంగాణ గొప్పతనం తెల్వాలంటే గుజరాత్, మహారాష్ట్రలో ఉన్న పరిస్థితులు చూడాలి, బీజేపీ వాళ్ళు ఢిల్లీలో అవార్డులు ఇస్తారు గల్లీలో తెలంగాణ పై విమర్శలు చేస్తరన్నారు. ధరణి వచ్చింది కాబట్టే, రైతు బంధు డబ్బులు కటుక ఒత్తితే రైతుల అకౌంటల్లో డబ్బులు పడుతున్నాయి.

నయా పైసా లంచం లేకుండా ప్రభుత్వం ఇచ్చే 60 వేల కోట్లు రైతు బంధు కింద 65 లక్షల మందికి చేరాయి అంటే ధరణి వల్లే.. వీఆర్వో కాదు కదా జిల్లా కలెక్టర్ కూడా ఒకరి భూమి మరొకరికి రాసే అవకాశం లేదన్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్ లో తెలంగాణ టాప్, అంబేద్కర్ గారు చెప్పినట్టు నిజాలు ప్రచారం చేయాలి. సుపరిపాలన, హైటెక్ అనే ఒక లీడర్ ఉండే.. ఎపీ వెనకబడి పోయిందన్నారు. మాటలు కోటలు దాటాయి, చేతలు పకోడీ చేసినట్లు ఉంది, వాళ్లది పని తక్కువ, మనది పని ఎక్కువని చెప్పారు.