mt_logo

దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారు : మండలి చైర్మన్‌ గుత్తా

  • తెలంగాణ రాష్ట్రం దేశనికే ఆదర్శం
  • తొమ్మిదేండ్లలో మారిన వ్యవసాయ ముఖచిత్రం

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో సబ్భాండ వర్గాలు, సకల జనులు సంతోషం గా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 9 ఏళ్ళు పూర్తి చేసుకొని పదవ సంవత్సరoలోకి అడుగేడుతున్నాం. తెలంగాణా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో లబ్ది జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ రంగం చాలా అభివృద్ధి చెందిందని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు
నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారు.దేశంలో అత్యధిక జీతాలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే, ఇప్పటికే లక్ష యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసాం మరో 50వేల ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేయడం జరుగుతుందని చెప్పారు.

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసింది ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన తెలంగాణ రాష్ట్రం దేశనికే ఆదర్శంగా నిలిచింది అన్నారు. కానీ ప్రతిపక్షాలు అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నాయి, అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు పగటి కలలు కంటున్నాయని మండిపడ్డారు. దేశ ప్రజలు కూడా కేసీఆర్ గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు, జూన్ 2వ తేదీ నుండి నిర్వహించే రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి, కాంగ్రెస్ పార్టీ నేతలు అసూయతో రగిలి పోతున్నారు.అందుకే రాష్ట్ర అవతరణ ఉత్సవాలపై కామెంట్స్ చేస్తున్నారని అన్నారు. కనీస విజ్ఞత లేకుండా ఉత్సవాలపై రాద్ధాంతం చేస్తున్నారు, రానున్న ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది