mt_logo

ఎలక్ట్రికల్ వెహికల్ రంగంలో తెలంగాణ ముందంజలో ఉంది : మంత్రి కేటీఆర్

ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందు వ‌రుసలో ఉంద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. లండ‌న్ లో పర్యటనలో ఉన్న కేటీఆర్.. యునైటెడ్‌ కింగ్‌డం-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌, ఎస్ఎంఎంటీ ఏర్పాటు చేసిన మూడో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆటో మొబైల్ ఇండ‌స్ట్రీ ప్ర‌తినిధుల‌తో కేటీఆర్ స‌మావేశ‌మై.. తెలంగాణ‌లో పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించారు. విదేశీ పెట్టుబ‌డుల‌కు తెలంగాణ గ‌మ్య‌స్థానంగా మారింద‌న్నారు. తెలంగాణలో స‌మ‌గ్ర‌మైన‌, ప్ర‌గ‌తిశీల ఈవీ పాల‌సీని ప్రారంభించామ‌ని కేటీఆర్ వివరించారు. ఇప్ప‌టికే ప‌లు ఈవీ కంపెనీలు త‌మ కార్యక‌లాపాల‌ను తెలంగాణ‌లో ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌య్యాయ‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *