mt_logo

సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు సోమేష్ కుమార్

హైదరాబాద్:ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్ నేడు ఉదయం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన సలహాదారుగా 6వ అంతస్తులో కేటాయించిన ఛాంబర్‌లో అర్చకులు పూజలు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమేష్ కుమార్ కు సచివాలయంలోని అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.తనపై విశ్వాసం ఉంచి రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారు సోమేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.