mt_logo

రాజ్యాంగ హక్కులు కాపాడాల్సిన పోలీసులు రేవంత్‌కు కొమ్ముకాస్తున్నారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ప్రాణభయం ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి మా నాయకుల ఫోన్లతో పాటుగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భయానక పరిస్థితిలు నెలకొన్నాయి అని అన్నారు.

రాజ్యాంగ హక్కులు కాపాడాల్సిన పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి కొమ్ముకాస్తున్నారు. గాంధీ భవన్ నుంచి ఎఫ్ఐఆర్‌లు నమోదవుతున్నాయి. ఆ ఎఫ్ఐఆర్‌ ఆధారంగా పోలీసులు కేసులు పెడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరులు రాజ్యాంగేతర శక్తులుగా మారుతున్నారు అని దుయ్యబట్టారు.

ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాక, కొడంగల్ నుంచి కోదాడ దాక బీఆర్ఎస్ పార్టీల నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి హోం మంత్రి, ముఖ్యమంత్రిగా మారిండు.. ఇదీ మన రాష్ట్ర ప్రజల దురదృష్టం. మా పార్టీ నాయకుడు కేటీఆర్ పైన, ఇతర నాయకులపైన అక్రమ కేసులు పెడుతున్నారు అని విమర్శించారు.

తెలంగాణ ప్రజల పక్షాన రైతుల పక్షాన పోరాడుతున్న హరీష్ రావుపైన అక్రమ కేసులు పెడుతున్నారు. ఈనెల 9 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో.. అధికార కాంగ్రెస్ పార్టీని ఉతికి ఆరేస్తామని మమ్మల్ని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రజల ఖజనాని లూటీ చేస్తుంటే, బీఆర్ఎస్ అడ్డుకుంటుంటే మాపైన అక్రమ కేసులు పెడుతున్నారు అని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

25 రోజులుగా పట్నం నరేందర్ రెడ్డిని జైల్లో పెట్టారు.. కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు దూరం చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపైన కేసు హాస్యాస్పదం. పాడి కౌశిక్ రెడ్డి ప్రాణాలకు ప్రమాదం ఉన్నదని నాతో అనేక సార్లు చెప్పారు. ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ అనుచరులు చంపుతారు అని నాతో అనేకసార్లు చెప్పాడు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని పేర్కొన్నారు.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఏసీపీ వెంకట రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోని ఫిర్యాదు చేసేందుకు పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. ఫోన్ ట్యాపింగ్ , ప్రాణాలకు ప్రమాదం ఉన్నదని కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేసేందుకు వెళ్ళాడు. కౌశిక్ రెడ్డి ఫిర్యాదు పోలీస్‌లు తీసుకోలేదు.. తీసుకోగపోగా ఆయనపైనే కేసు నమోదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డిపైన అక్రమ కేసులు పెట్టీ అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్లో చిత్ర హింసలకు గురి చేస్తున్నారు అని అన్నారు.

ప్రజాప్రతినిధులు కానివారికి పోలీస్ శాఖ బందోబస్తు కల్పిస్తుంది.. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి పోలీస్ శాఖ రక్షణ కల్పిస్తుంది. ప్రజా ప్రతినిధి అయిన కౌశిక్ రెడ్డికి పోలీస్ శాఖ ఎందుకు రక్షణ కల్పించదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇష్టం వచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి తిట్టాడు.. ఆయనపైన బీఎన్ఎస్ యాక్ట్ క్రింద ఎందుకు కేసు పెట్టడం లేదు అని అడిగారు.

దోపిడీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది.. తెలంగాణ తల్లికి జరుగుతున్న అన్యాయంపైన బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. పట్నం నరేందర్ రెడ్డి నేరం ఒప్పుకోకున్న, కుట్ర పూరితంగా నేరం మోపారు. తెలంగాణ రాష్ట్రంలో జైళ్లో ఉండాల్సిన సంఖ్య 7 వేలు మాత్రమే. తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల మంది ప్రజలను అరెస్ట్ చేసి ఏ జైల్లో పెడతావు రేవంత్ రెడ్డి అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.

మా నాయకులను అరెస్ట్ చేసి తెల్లవారుజామున , రాత్రి పూట జడ్జీల ముందు నిలబెడుతున్నారు. కోర్టులు మొట్టికాయలు వేస్తున్న ఈ ప్రభుత్వ వైఖరి మారడం లేదు. ఈ ప్రభుత్వ వైఖరిపైన రాష్ట్ర ప్రజలు గమనించాలి. మాజీ మంత్రి హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది అని తెలిపారు.

రేవంత్ రెడ్డి నుండి ప్రాణభయం ఉన్నదని కౌశిక్ రెడ్డి అనేక సార్లు నాకు చెప్పాడు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. మా నాయకుల ఫోన్లతో పాటుగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్, ఇతర నాయకుల ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నారు అని అన్నారు.