mt_logo

కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలకు మద్దతు ప్రకటించిన ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్

  • నేను కేసీఆర్ కుమార్తెగా గర్వపడుతున్నాను.. రాజకీయ వారసత్వాలను మేము గౌరవిస్తాం
  • బీజేపీకి లొంగితేనే కుటుంబ పార్టీలు ఆమోదయోగ్యమ?
  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్
  • తమిళనాడు వైరల్‌గా మారిన ఎమ్మెల్సీ కవిత ప్రసంగం
  • బీజేపీకి గట్టి సమాధానం ఇచ్చారంటూ ప్రశంసల వెల్లువ
  • పోలవరం తెలంగాణలో ఉందంటూ అన్నమలై చేసిన వ్యాఖ్యలపై వైరల్ అవుతున్న మీమ్స్

హైదరాబాద్: తాను సీఎం కేసీఆర్ కుమార్తెగా గర్వపడుతున్నానని, తాము రాజకీయ వారసత్వాలను గౌరవిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. ఒక టీవీ ఛానల్ నిర్వహించిన సమ్మిట్‌లో తాను  చేసిన ప్రసంగపు వీడియోను జతచేస్తూ ఈ మేరకు శుక్రవారం నాడు కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

“బీజేపీతో అంటకాగినప్పుడు పలు పార్టీల్లో వారసత్వ రాజకీయాలు బీజేపీకి కనిపించకపోవడం విడ్డూరంగా ఉంది. బీజేపీకి లొంగితేనే  కుటుంబ పార్టీలు ఆ పార్టీకి ఆమోదయోగ్యమా ? ” అని కవిత ప్రశ్నించారు. అయితే, ఒక టీవీ సంస్థ నిర్వహించిన సదస్సులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు కూడా వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తమిళనాడు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కల్వకుంట్ల కవిత చేసిన ప్రసంగానికి మంత్ర ముగ్ధులయ్యారు. 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దృష్టి మళ్లింపు రాజకీయాలు చేస్తుండటమే కాకుండా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వదని, గత పది సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం రూ. 100 లక్షల కోట్ల అప్పు తెచ్చిందని, ఇచ్చిన హామీలను అమలు చెయ్యకపోవడమే కాకుండా దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఎటువంటి ప్రాజెక్టులు మంజూరు చేయడం లేదని సదస్సులో కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. బీజేపీ హిందుత్వ రాజకీయాలను సమర్ధవంతంగా ఎండగట్టారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ తమిళ ప్రజలు పెద్ద ఎత్తున ట్వీట్లు చేశారు. 

వాస్తవాలు, గణాంకాలతో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలైకు కల్వకుంట్ల కవిత గట్టిగా సమాధానం ఇచ్చారని అ ట్విట్ లలో పేర్కొన్నారు. కుటుంబ పార్టీలు అంటూ విమర్శించే అర్హత బీజేపీకి లేదని స్పష్టం చేశారు. మరొకవైపు, బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ కవిత చేసిన వ్యాఖ్యలను ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ సమర్ధించారు. ట్విట్టర్ లో కవిత మాట్లాడిన వీడియోను షేర్ చేసిన ఆయన “కవిత మంచి క్లాస్ తీసుకున్నారు” అంటూ స్పందించారు.

పోలవరం తెలంగాణలో ఉందంటూ అన్నమలై చేసిన వ్యాఖ్యలపై వైరల్ అవుతున్న మీమ్స్ చర్చ వేదికలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై కనీస పరిజ్ఞానం లేకుండా పోలవరం ప్రాజెక్టు తెలంగాణలో ఉందంటూ వ్యాఖ్యానించి నెటిజన్ల ముందు నవ్వుల పాలయ్యారు.  అన్నమలై వ్యాఖ్యల ఆధారంగా నెటిజెన్లు రూపొందించిన మీమ్స్ వైరల్ గా మారాయి.