mt_logo

300 మంది బీసీ బంధు లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ

సంగారెడ్డి నియోజకవర్గంలో బీసీ బంధు ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. 300 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ చేసి, అనంతరం రెగ్యులరైజ్ అయిన పంచాయతీ సెక్రటరీలకు ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. ఇదే క్రమంలో సైదాపూర్, గంగాపూర్, మారేపల్లి గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల ప్రొసీడింగ్స్‌ను రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అందించారు.

ఉద్యోగ నియామక పత్రాలు అందజేత

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడారు. ఈరోజు సంగారెడ్డిలో పంచాయతీ సెక్రెటరీలను రెగ్యులరైజ్ చేస్తూ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారు. చిన్న గ్రామపంచాయతీలో కూడా సర్పంచ్ తో పాటు పంచాయతీ సెక్రటరీ నియమించి పదివేల మంది పంచాయతీ సెక్రటరీలకు ఉపాధి కల్పించామని తెలిపారు. 3 శాతం ఉన్న తెలంగాణ జనాభాకు 38% అవార్డులు దేశంలో వస్తున్నాయంటే దాని వెనుక పంచాయతీ సెక్రెటరీల కృషి ఉందన్నారు. ఈరోజు అన్ని గ్రామాలకు ట్రాక్టర్, ట్రాలీ, వైకుంఠ ధామం, నర్సరీ ఉన్నాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు.

300 మందికి బీసీ కుల వృత్తులకు 1 లక్ష రూపాయల సహాయం

దేశంలో ఏ రాష్ట్రంలో ఏ గ్రామానికి ఇన్ని వసతులు లేవు. గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయి కాబట్టి అంటు రోగాలు నిర్మూలించగలిగాం అన్నారు. సంగారెడ్డిలో 300 మందికి మొదటి దశ బీసీ కుల వృత్తులకు లక్ష రూపాయల సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది దశలవారీగా కొనసాగుతుంది బీసీ బంధు నిరంతర ప్రక్రియ అన్నారు. బీసీ వర్గాలనే కాదు అన్ని కులాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న నాయకుడు మన ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. అదే విధంగా ఈరోజు ముఖ్యంగా బీసీల సంక్షేమం కోసం కేసీఆర్ చేసే అనేక పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి అన్నారు

19 బీసీ గురుకుల పాఠశాలల నుండి 310 గురుకుల పాఠశాలలు

తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 19 బీసీ గురుకుల పాఠశాలలుంటే ఈరోజు 310 గురుకుల పాఠశాలలు బీసీల కోసం ఏర్పాటు చేసుకున్నాం. వాటిని జూనియర్ కాలేజీగా అప్ గ్రేడ్ కూడా చేసుకున్నాం అన్నారు. మహిళ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుని ఆడపిల్లల విద్య కోసం శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. అదే విధంగా పై చదువులు చదువుకోడానికి బయట దేశాలకు పోవాలనుకున్న వారి కోసం జ్యోతిబాపూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద రూ. 20 లక్షలు ఆర్థిక సాయం ముఖ్యమంత్రి చేస్తున్నారని తెలిపారు.

కులవృత్తులు ఆత్మగౌరవంతో బతకాలని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణులకు, రజక సోదరులకు ఉచిత కరెంటు ఇస్తున్నారు. రూ. 100 కోట్లతో 35 వేల సెలూన్లకు 60 వేల లాండ్రీ షాపులకు ఉచిత కరెంటు ముఖ్యమంత్రి ఇస్తున్నారని అన్నారు. అదేవిధంగా గీత కార్మికుల కోసం పాత బకాయిల రద్దు చేసి చెట్టు పన్ను నాయకుడు కేసీఆర్ రద్దు చేశారు. 6 లక్షల రూపాయల ప్రమాద బీమా కూడా అందిస్తున్నారు.

మగ్గమున్న ప్రతి ఒక్కరికీ పెన్షన్

నేతన్నను కూడా ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్. మగ్గమున్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇస్తామన్నారు అదేవిధంగా పింఛను ఇస్తున్నారన్నారు. సద్ది తిన్న రేవు కలవాలి అంటారు అందుకనే ఇన్ని సంక్షేమ పథకాలు చేసి ప్రజలను కాపాడుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ గెలిపియాలన్నారు.

ఈరోజు 70 వేల కోట్లు రైతుబంధు కింద రైతులకు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. 5300 కోట్ల రూపాయలు రైతు బీమా కింద రైతు కుటుంబానికి సహాయం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. పక్కన ఉన్న కర్ణాటకలో 24 గంటలు కరెంటు ఉందా. రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ లలో 24 గంటల కరెంటు ఇస్తున్నారా? అని అడిగారు. ఈ దేశంలో 24 గంటల కరెంటు రైతుల ఇస్తుంది అంటే అది కేవలం ఒకే ఒక నాయకుడు మన కేసీఆర్ అన్నారు.

కేసీఆర్ రైతులకు అడిగింది ఇచ్చిండు.. అడగంది ఇచ్చిండు

సోమవారం రోజు పెద్ద ఎత్తున రైతుల అకౌంట్లో డబ్బులు వేసి సోమవారం సాయంత్రం వరకు 99 వేల రూపాయల వరకు రైతు రుణ మాఫీ చేస్తాం అన్నారు. కేసీఆర్ రైతులకు అడిగింది ఇచ్చిండు అడగంది కూడా ఇచ్చిండు. రైతుబంధు రైతు బీమా ఇచ్చిండు రైతులకు ఉచిత ఎరువులు పంపిణీ చేసిండు. కాళేశ్వరం కట్టి పుష్కలంగా నీళ్లు తెచ్చిండు 24 గంటల కరెంటు ఇచ్చిండు కేసీఆర్. ఈ రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారే అని అన్నారు.