mt_logo

కాంగ్రెస్ పార్టీ దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుంది : ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ పార్టీ దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పెట్టి దళితులకు ఏమో చేస్తామనడం భావ దారిద్య్రం తప్ప మరొకటి కాదు.

ఖర్గే వచ్చి ఎస్సీ డిక్లరేషన్ చేయడం అర్రస్ పాట పాడినట్లు ఉంది. రాజకీయం కోసం తప్ప దళితుల కోసం చేసేదేమీ లేదన్నారు. ఇన్ని రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏమి చేసింది. ఇప్పుడు ఎన్నికలు ఏమి చేస్తారు. రైతుల కోసం బీజేపీ మీటింగ్ పెట్టడం ఆ సభకు అమిత్ షా రావడం హంతకుడే రైతులకు సంతాపం తెలిపినట్టుందన్నారు. దళితుల కోసం పనిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అన్నారు.

కర్ణాటక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని కుంటి సాకుగా చెబుతూ ఉచిత పథకాలను ఎత్తి వేసిందని గుర్తు చేసారు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన రైతు బందును కాపీ కొట్టి మోడీ ప్రభుత్వం 13 కోట్ల మందికి రైతు బంధు ప్రారంభించి 2.5 కోట్ల మందికే ఇస్తున్నారు. మన రాష్ట్రంలో మాత్రం అందరికీ ఇస్తున్నారని తెలిపారు.