mt_logo

సబ్ జూనియర్ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన మంత్రి మహేందర్ రెడ్డి

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిని జ్వాల గుత్త మొయినాబాద్ టెన్నిస్ అకాడమీలో అండర్ 15,17 బాల, బాలికల 36వ యోనెక్స్ సన్ రైస్ సబ్ జూనియర్ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు & గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో దేశంలోని 33 రాష్ట్రాల నుంచి 560 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. దేశంలోనే మహోన్నతంగా తెలంగాణలో క్రీడా పాలసీ రానుందని తెలిపారు.

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో 18 వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. గతంలో పీవీ సింధు, సానియా మీర్జా ఇలాంటి క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సహించింది.

మంత్రి కేటీఆర్ సహకారంతో జ్వాలా గుత్తా అకాడమీకి ప్రోత్సాహం లభించింది. క్రీడా పాలసీ కోసం మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులతో కూడిన మంత్రివర్గ ఉప సంఘం పలు అంశాలను చర్చించారు. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరిగే విధంగా పాఠ్యాంశాలలో భాగం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.