mt_logo

తెలంగాణ క్రీడాకారులకు కేసీఆర్ పాలన స్వర్ణయుగం : మంత్రి మహేందర్ రెడ్డి

తెలంగాణలో  క్రీడాకారులకు సీఎం కేసీఆర్ పాలన కాలం స్వర్ణయుగం నిలుస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల మరియు గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. తొలి తెలుగు  భారత అంతర్జాతీయ ఓపెన్ వాటర్ స్విమ్మర్ గోలి శ్యామల మంత్రి మహేందర్ రెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.సెప్టెంబర్ 3న కలకత్తాలో జరిగిన భగీరథ నదిలో 81 కిలోమీటర్ల దూరం కేవలం 13 గంటల్లో ఈదిన సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి  శ్యామలను శాలువాతో సత్కరించారు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఓపెన్ వాటర్ స్విమ్మర్ గోలి శ్యామల గత ఏడాది గోలి శ్యామల తలైమన్నార్ (శ్రీ లంక) నుండి ధనుష్కోడి (భారత దేశం) వరకు హిందూ మహాసముద్రం లో 13:43 గంటలు ఈది ప్రపంచ రికార్డులు స్థాపించడం పట్ల అభినందించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 36 కి.మీ గల కాటలిన ఛానల్ ను 20 గంటల్లో ఈదిన  తొలి తెలుగు మహిళగా భారత దేశపు ఖ్యాతిని, తెలంగాణ సమాజ గౌరవాన్ని దశ దిశలకు వ్యాపింపజేస్తూ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు అభినందించారు. రానున్న రోజుల్లో గోలి శ్యామల పాల్గొనే పోటీలకు ప్రభుత్వ  పూర్తి సహకారం ఉంటుందని మహేందర్ రెడ్డి  తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో అన్ని క్రీడా అంశాలలో నైపుణ్యం గల క్రీడాకారులను ప్రభుత్వం ఆదరిస్తుందని, వారికి పెద్దపీట వేసి వారిని అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా చూస్తుందని మహేందర్ రెడ్డి చెప్పారు.