mt_logo

రాజకీయాల కోసం కాళేశ్వరాన్ని బద్నాం చేయడం అన్యాయం: మంత్రి కేటీఆర్

తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందింది.  తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని స్పష్టం చేసారు. కేసీఆర్‌ వచ్చినంకనే కొత్త జిల్లాలు ఏర్పాటు జరిగిందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని తెలిపారు. జీఎస్డీపీలో అత్యంత వేగంగా పెరుగుతున్న రాష్ట్రం తెలంగాణ. పేదరికాన్ని తగ్గించిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. 

పచ్చని పంటలతో తెలంగాణ కళకళలాడుతోందని సూచించారు. తెలంగాణలో పంటల దిగుబడి పెరిగిందిని స్పష్టం చేసారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అన్నపూర్ణగా మారింది. మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అందిస్తున్నాం అన్నారు. మిషన్‌భగీరథ ద్వారా తాగునీటి కోసం రూ. 37 వేల కోట్లు ఖర్చు చేశాం అని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా 58 లక్షల కుటుంబాలకు నీరు అందిస్తున్నాం అని వివరించారు. మిషన్‌ భగీరథను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయి. 

మిషన్‌ భగీరథ స్ఫూర్తితో కేంద్రం హర్‌ ఘర్ జల్ పథకాన్ని ప్రారంభించింది. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది.  46 వేల చెరువులను మిషన్‌కాకతీయ ద్వారా పునరుద్ధరించినం అని అభివర్ణించారు. ప్రతి గ్రామంలో చెరువులు నిండు కుండలా కనిపిస్తున్నాయి. సాగునీరు రావడంతో సంపద సృష్టించబడిందన్నారు.  నీళ్లు, నిధులు, నియామకాలకు సంపూర్ణ న్యాయం చేసింది తెలంగాణ ప్రభుత్వం అని తేల్చి చెప్పారు. 

ప్రాజెక్టుల కోసం రూ. లక్షా 70 వేల కోట్లు ఖర్చు చేశాం అన్నారు.  ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం నిర్మించాం.. కాల్వలు తవ్వి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశాం. మన ఊరు- మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేశాం.. రైతును రాజును చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని వెల్లడించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేంద్రమే చెప్పింది. సాగుకు 24 గంటల కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. 

కేంద్రంలో దుర్మార్గమైన ప్రభుత్వం ఉందని ఆరోపించారు. తెలంగాణకు అప్పులు పుట్టకుండా కేంద్రం కుట్ర చేసిందన్నారు. ఏడాదిలోగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసాం అని వివరించారు. తెలంగాణకు లిఫ్ట్ ఇరిగేషన్ ఒక్కటే మార్గం అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు పవర్ ఇస్తే.. ప్రజలకు కరెంట్ ఉండదని హెచ్చరించారు. నల్గొండలో ఫ్లోరోసిస్‌ లేకుండా చేశాం అని తేల్చి చెప్పారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది.  గ్రామ పంచాయతీలకు మౌలిక సదుపాయాలు కల్పించామని వివరించారు. 

గ్రామీణాభివృద్ధిలో తెలంగాణకు అవార్డులు వస్తున్నాయి. పల్లె ప్రగతితో గ్రామ స్వరాజ్యం స్థాపిస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేశాం. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు అని అన్నారు. ప్రాజెక్టులపై రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. ప్రాజెక్టులను బద్నాం చేసి అన్యాయం చేయొద్దన్నారు. బ్యారేజీల్లో సమస్యలు కామన్..  సాగర్ కట్టిన తరువాత కూడా లీకేజీ సమస్యలు వచ్చాయని గుర్తు చేసారు. రెండేళ్ల క్రితం శ్రీశైలం పంపులు కూడా నీట మునిగాయని తెలియజేశారు.