mt_logo

ఉస్మానియా ఆసుపత్రిలో సీటీస్కాన్, క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించిన మంత్రి హ‌రీశ్‌రావు

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు మంగళవారం ఉస్మానియా ఆస్ప‌త్రిలో కొత్త‌గా ఏర్పాటు చేసిన సీటీ స్కాన్‌ను, క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించారు. వీటితోపాటు అగ్నిమాప‌క యంత్రం, ఆక్సిజ‌న్ ప్లాంట్‌ను కూడా ప్రారంభించి, ఓపీ స్లిప్పుల జారీ కేంద్రం ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు ఆసుపత్రిలోని పలువురు రోగులను వైద్య సదుపాయాలు, సౌకర్యాల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. కాగా ఉస్మానియా ల్యాబ్ లో క్యాథ్ ల్యాబ్ కోసం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ 8 కోట్లు మంజూరు చేసింది. సోమవారం నిలోఫ‌ర్ హాస్పిట‌ల్‌లో 2 కోట్ల వ్య‌యంతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, నియోనాట‌ల్ స్కిల్ ల్యాబ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హరీష్ రావుతోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీలు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *