mt_logo

మలేషియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మలేషియా తెలుగు ఫౌండేషన్ (MTF) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి, మలేషియాలోని కౌలాలంపూర్‌లో సోమా ఆడిటోరియం హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మలేషియాలోని తెలుగువారు హాజరయ్యారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా ఇండియన్ హై కమిషనర్ బీఎన్ రెడ్డి మరియు ప్రసిద్ధ తెలుగు సినిమా గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఇండియన్ హై కమిషనర్ బీన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ నిర్వహిస్తున్న మలేషియా తెలుగు ఫౌండేషన్ వారిని అభినందించారు. ఈ సంక్రాంతి తెచ్చే సంబరాలు ప్రతి ఇంట ఆనందం వెల్లి విరియాలని అయన ఆకాంక్షించారు. అలాగే సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వందేమాతరం శ్రీనివాస్ పాడిన పాటలు ప్రధాన ఆకర్షణగా ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే పాడుతా తీయగా ఫేమ్ మాస్టర్ సార్థక్ మరియు స్టార్ మా సూపర్ సింగర్ మరియు వాయిస్ అఫ్ హైదరాబాద్ సీసన్ 6 విన్నర్ బేబీ సోనాలిక పాటలు ఆహుతులను అదరహో అనిపించాయి. చిన్నారుల పాటలుతో ఆడిటోరియం కళకళలాడింది సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకమైన సంక్రాంతి సందడి మలేషియాలో కనిపించింది.

మలేషియా తెలుగు ఫౌండేషన్ ప్రెసిడెంట్ దాతో కాంతారావు అక్కునాయుడు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సంక్రాతిని పెద్ద పండగగా ఘనంగా జరుపుతున్నట్లు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో మలేషియా తెలంగాణ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ ఆనంద్, డాక్టర్ ప్రకాష్ రావు, ప్రెసిడెంట్ తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్, పిరమిడ్ అండ్ మెడిటేషన్ సొసైటీ అఫ్ మలేషియా ప్రెసిడెంట్ ఎన్‌బి లచ్చు, సీఈఓ పైడా ఇంటర్నేషనల్, ఇతర సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు.