mt_logo

ఖమ్మం కార్పొరేషన్‌కు రూ. 100 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్

-మంత్రిగా నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మంత్రి అజయ్‌కూమర్‌కి   జీవో అందజేసిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ గారు నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఖమ్మంకు మరోసారి నిధుల వరద పారించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేటీఆర్‌కి చేసిన విజ్ఞప్తి మేరకు TUFIDC(తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ద్వారా ఖమ్మంకు 100 కోట్ల నిధులను విడుదల చేశారు. నేడు ఐటీ మరియు పురపాలక శాఖ  మంత్రి కేటీఆర్ చేతుల మీదగా జీవో కాపీని మంత్రి పువ్వాడ అజయ్‌కూమర్‌కి అందజేశారు. ఖమ్మం అభివృద్ధికి  మరో 100 కోట్ల నిధులు ఇచ్చిన సందర్భంగా  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా నాలుగేళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న అజయ్‌కూమర్‌కి   కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.