mt_logo

ప్రజలంతా కేసీఆర్ వైపే: మంత్రి జగదీశ్ రెడ్డి

  • చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకున్న నేత కేసీఆర్
  • రేషన్ ద్వారా  సన్నబియ్యం, గ్యాస్ సిలిండర్  సబ్సిడీ కేసీఆర్ మానవీయ పాలనకు నిదర్శనం
  • తుంగతుర్తి లో ప్రశాంత వాతావరణం నెలకొల్పిన ఘనత కిషోర్ దే
  • పారిశ్రామిక హబ్‌ను నెలకొల్పి, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్నదే కిషోర్ ఆశయం
  • శంఖం ఊది ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన జగదీష్ రెడ్డి

చెప్పిన ప్రతి మాటను, చేసిన ప్రతి వాగ్దానాన్ని నిజం చేసిన  నేత  ముఖ్యమంత్రి కేసీఆర్ అని సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి  గాదరి కిషోర్ కుమార్ తరపున ఎన్నికల  శంఖారావాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి పూరించారు. అంతకుముందు అర్వపల్లిలోని యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నరసింహుని  సన్నిధిలో కిషోర్  కుమార్‌కు భీ- ఫారం ను అందజేశారు. అక్కడనే శంఖాన్ని  ఊది ప్రచార పర్వానికి తెరలేపారు. అర్వపల్లి లో తరలి వచ్చిన అశేష జనవాహిని ని ఉద్దేశించి   మంత్రి మాట్లాడుతూ రేషన్ ద్వారా  అందరికీ సన్నబియ్యం, సబ్సిడీ ద్వారా 400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలనే నిర్ణయాలు కేసీఆర్ మానవీయ పాలనకు నిదర్శనం అన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన  కేసీఆర్ వైపే  తెలంగాణ ప్రజలు ఉన్నారని అన్నారు. 2014 ముందు కక్షలు, కార్పణ్యాలతో రక్తమోడిన తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పిన ఘనత కిషోర్ దే అన్నారు. కిషోర్ హయాంలో తుంగతుర్తి నియోజకవర్గం సస్యశ్యామలం అయిందన్నారు. పారిశ్రామిక హబ్‌ను నెలకొల్పి , స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్నదే కిషోర్ ఆశయం అన్నారు. కిషోర్‌ను మరోసారి ఆశీర్వదించి  తుంగతుర్తి అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.